• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జగన్‌ను కలిసిన అంబటి రాంబాబు

GNTR: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లి లోని ఆయన నివాసంలో కలిశారు. తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, ఇంటిపై జరిగిన దాడి, పోలీసుల నిర్లిప్త వైఖరి వంటి అంశాలను అంబటి రాంబాబు జగన్‌కు వివరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం.

February 20, 2026 / 10:31 AM IST

రేపటి నుంచి సెలవుపై వెళ్లనున్న JC

ASR: పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి, ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ వారం రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఇటీవల ఐఏఎస్ అధికారి ఆదిత్య వర్మను, పీవో శ్రీపూజ విశాఖ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 24న వివాహ వేడుక జరుపుకోనున్నారు. ఈ మేరకు ఈ నెల 21 నుంచి 28 వరకు పీవో సెలవుపై వెళ్లనున్నారు.

February 20, 2026 / 10:31 AM IST

పరీక్షల టైం టేబుల్ విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. కాగా ఈ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరుగుతాయి.

February 20, 2026 / 10:31 AM IST

‘ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి’

KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన ఛైర్మన్ రిహన కమల్ పాషాని శుక్రవారం సత్తుపల్లిలో 5 వ వార్డ్ కౌన్సిలర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. అలాగే వారికి శుభాకాంక్షలు తెలిపారు. తమ దృష్టికి సమస్య వచ్చిన వెంటనే పరిష్కార దిశగా కృషి చేయాలని నూతన ఛైర్మన్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.

February 20, 2026 / 10:31 AM IST

సోమందేపల్లిలో 2వ రోజు సెహరీ కార్యక్రమం

సత్యసాయి: సోమందేపల్లి మండలంలో పవిత్ర రంజాన్ మాసంలో రెండవ రోజు ఉపవాస దీక్షను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. సోమందేపల్లిలోని జామియా మజీద్‌లో శుక్రవారం సహెరీ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఉపవాస దీక్షను ప్రారంభించారు. రంజాన్ మాసంలో ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలు పెంపొందించుకోవాలని మత పెద్దలు సూచించారు.

February 20, 2026 / 10:30 AM IST

రైల్వే బ్రిడ్జిలో ఇరుకున్న లారీ

విశాఖపట్నం కాన్వెంట్ జంక్షన్ సమీప రైల్వే బ్రిడ్జ్ వద్ద భారీ లారీ బ్రిడ్జ్‌ను ఢీకొని ఇరుక్కుపోయింది. అధిక ఎత్తుతో లోడ్ తీసుకెళ్తూ డ్రైవర్ ఎత్తు పరిమితి గమనించకపోవడంతో లారీ పైభాగం గర్డర్‌ను తాకింది. దీంతో రెండు వైపులా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలు కట్టాయి. పోలీసులు చొరవ తీసుకుని ట్రాఫిక్‌ను మళ్లించారు.

February 20, 2026 / 10:30 AM IST

తాండూరు మార్కెట్ కమిటికి మహర్దశ

VKB: తాండూరు మార్కెట్ కమిటికి మహర్దశ తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరిగిందని కమిటి ఛైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. తాండూరు మార్కెట్ కమిటికి రాజీనామా చేసిన పట్లోళ్ల బాల్ రెడ్డి గురువారం కమిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మార్కెట్ యార్డులో రూ. 29 కోట్లతో 100 షాపులు, కవర్ షెడ్లు, సీసీ రోడ్లు, ప్రహారి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు.

February 20, 2026 / 10:29 AM IST

‘పీఎం శ్రీ పాఠశాలల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి’

NGKL: పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన 14 పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పీఎం శ్రీ స్కూల్స్ పథకం కింద జిల్లాలో ఎంపికైన పాఠశాలల్లో నిర్మాణంలో ఉన్న 22 యూనిట్ల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

February 20, 2026 / 10:29 AM IST

జేఈఈ మెయిన్స్‌లో గురుకుల విద్యార్థినుల జోరు

NLG: నల్గొండ జిల్లా గంధంవారిగూడెం SLBC గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మట్టిలో మాణిక్యాల్లా మెరిసిన ఈ విద్యార్థినులను ప్రిన్సిపల్ లలితా కుమారి, వడ్డేపల్లి నాగరాజు గురువారం ఘనంగా సన్మానించారు. పట్టుదలతో శ్రమిస్తే అద్భుతాలు సాధించవచ్చని వారు ఈ సందర్భంగా విద్యార్థులను కొనియాడారు.

February 20, 2026 / 10:29 AM IST

తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు

BDK: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టపై ఎన్ కౌంటర్ జరిగినట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పష్టం చేశారు. దండకారణ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుబడి ఉన్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని, అధికారికంగా తామే వెల్లడిస్తామని తెలిపారు.

February 20, 2026 / 10:27 AM IST

‘చెత్తను మున్సిపల్ వాహనాలకు అందించాలి’

SDPT: జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 14వ వార్డులో నిండుకున్న డ్రైనేజీలను మున్సిపల్ ఛైర్ పర్సన్ దండి లక్ష్మి కొమరయ్య పారిశుద్ధ్య కార్మికులచే క్లీన్ చేస్తున్నారు. రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ప్రజలు చెత్త రోడ్లపై పారవేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. ఈ మేరకు కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

February 20, 2026 / 10:26 AM IST

ఈనెల 25న పెళ్లికూరులో విద్యుత్ అదాలత్

TPT: పెళ్లికూరు మండలంలోని ఈనెల 25న సమస్త గ్రామాల పరిధిలో విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదాలత్ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత న్యాయమూర్తి శ్రీనివాస అంజనేయమూర్తి, అధిక సభ్యులుగా జి. మధుకుమార్ పాండే తదితరులు పాల్గొంటారు. విద్యుత్ సంబంధిత సమస్యలు ఉన్న వినియోగదారులు తమ ఫిర్యాదులను సమర్పించి పరిష్కారం పొందవచ్చని తెలిపారు.

February 20, 2026 / 10:25 AM IST

నాగన్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి స్వల్ప గాయాలు

NZB: బోధన్ మండలం సాలురా ప్రధాన రహదారిపై నాగన్‌పల్లి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో బాధితులను ఆసుపత్రికి తరలించారు.

February 20, 2026 / 10:24 AM IST

25 నుంచి EXAMS.. ఫోన్‌ కు హాల్ టికెట్స్

SRD: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనట్లు అధికారి గోవిందారం తెలిపారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ లింకులు పంపామని, వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు నేరుగా కళాశాల ప్రిన్సిపల్స్ వద్ద కూడా వీటిని తీసుకోవచ్చన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

February 20, 2026 / 10:21 AM IST

ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధికి కృషి

MNCL: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో మంచిర్యాల నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై ప్రత్యేక దృష్టి సారించి రోడ్ల విస్తరణ చేపడతామని పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా డివిజన్లలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరుస్తామని, శాశ్వత డంపింగ్ యార్డు ఏర్పాటుకు త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు.

February 20, 2026 / 10:20 AM IST