KNR:గంగాధర మండలంలో మాజీ సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని కోరుతూ గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో డి.రాముకు పలువురు మాజీ సర్పంచ్లు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు మాజీ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ మడేరు అనకట్ట సమీపంలో శుక్రవారం ఉదయం కారు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కొండపల్లి గ్రామానికి చెందని బీరబోయిన సీతారత్నం (30) మృతి చెందినట్లు జడ్డంగి PHC డా. నాగార్జున తెలిపారు. ఈ ప్రమాదంలో బీరబోయిన బాబూరావు, బీరబోయిన దమయంతి, లక్ష్మీ, వరప్రసాద్కు తీవ్రగాయాలు అయ్యాయి. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.
ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్లో గురువారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.25 వేల ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు. మార్కెట్కు మొత్తం 462 టన్నుల దిగుమతి రాగా, నాణ్యతను బట్టి కనిష్ఠంగా రూ.8 వేలు, సరాసరిగా రూ.17 వేల ధర లభించినట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులతో పోలిస్తే ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ శివారులో ఉన్న పెద్ద చెరువు వద్ద పక్షులు కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఆ చెరువు వద్దకు పలు రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ఓరియంటల్ వైట్ ఇబ్బిస్, కామన్ కూట్ వంటి పక్షులు అక్కడకు చేరుకుంటున్నాయి. చెరువు ప్రాంతంలో ఆహారం, నీరు అందుబాటులో ఉండడంతో పక్షులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
MNCL: జన్నారం మండలంలోని కిష్టాపూర్ శివారులో ఉన్న పెద్ద చెరువు వద్ద పక్షులు కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఆ చెరువు వద్దకు పలు రకాల స్వదేశీ, విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ఓరియంటల్ వైట్ ఇబ్బిస్, కామన్ కూట్ వంటి పక్షులు అక్కడకు చేరుకుంటున్నాయి. చెరువు ప్రాంతంలో ఆహారం, నీరు అందుబాటులో ఉండడంతో పక్షులు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
HYD: జలమండలి ప్రజలతో మమేకమయ్యేందుకు ‘బస్తీ బాట’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం శుక్రవారం నుంచి వారానికి నాలుగు రోజులు అమలులో ఉంటుంది. ఈ సందర్భంగా, ఎండీ నుంచి వార్డు మేనేజర్ల వరకు అధికారులు బస్తీలు, కాలనీల్లో ప్రత్యక్షంగా పర్యటించి నీరు, సీవరేజ్ సమస్యలను గుర్తించి, తక్షణ పరిష్కార చర్యలు చేపడతారు.
SRCL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని 14, 19వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు. రూ. 1300 కోట్లకు పైగా బడ్జెట్తో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే, ఈ సినిమాలో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
MBNR: సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ చెస్ ఉమెన్స్ టీం బయలుదేరింది. యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ క్రీడాకారులను అభినందించి ట్రాక్ షూట్ మరియు టీం యూనిఫామ్లను అందించి క్రీడల్లో మంచి ప్రదర్శన కనబరచాలని కోరారు. రిజిస్టర్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్ర పాల్గొన్నారు.
W.G: చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలు, అన్యాయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషిచేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు చేస్తానన్న మంచిని చేయకుండా వాటి నుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకు ప్రశ్నించిన వారిపై కేసులు నమోదుచేస్తున్నారని విమర్శించారు.
మాజీ క్రికెటర్లు జట్టుగా సాధించలేనివెన్నో తాము చేశామన్న పాక్ ప్లేయర్ షదాబ్ ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. దీనిపై షాహిద్ అఫ్రిదీ స్పందిస్తూ.. ‘షదాబ్ చెప్పినట్లే మేం టీమిండియాను ఓడించలేకపోయాం. కానీ ఆ విజయంతో పొందిన గౌరవాన్ని వాళ్లు కాపాడుకోలేకపోయారు. బాగా ఆడనప్పుడే మేం విమర్శిస్తాం. జట్టు నుంచి తొలగించినప్పుడు మేమే మద్దతుగా నిలిచామని గుర్తుపెట్టుకోవాలి’ అని అన్నాడు.
యోగాసనాల్లో శవాసనం చేయడం చాలా సులభం. ఇది చాలా మందికి ఇష్టమైన ఆసనం కూడా. దీనికి శవంలా పడుకుంటే చాలు. శవాసనం చేస్తున్నప్పుడు పడుకుని మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేయాలి. కళ్ళు మూసుకుని ఈ ఆసనం వేసేటప్పుడు మనస్సు శరీరంలోని ప్రతి భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వాలి. దీంతో రక్తపోటు తగ్గుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
అన్నమయ్య: కలకడకు చెందిన శివమ్మ(42) తిరుమలలో ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసింది. ప.గో జిల్లా తనుకుకు చెందిన కుటుంబం గురువారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చింది. కాగా చిన్నారులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్లో తీసుకెళ్తుండగా కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, నిందితురాలిపై కేసు నమోదు చేసే అరెస్ట్ చేశారు.
సత్యసాయి: భారతీయ వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీ కోసం నిర్వహించే ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్చి 9 ఎంపికలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకుడు చెరుకుల జనార్ధన్ యాదవ్ను రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది. ఈ సందర్భంగా ఆయన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.