WNP: ఆర్థిక స్తోమత సరిగా లేక, సొంత ఇల్లు నిర్మించుకోలేక నానా అవస్థలు పడుతున్న నిరుపేదల సొంత ఇంటి కల నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సకారం అవుతుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ప్రతి ఇంటికి పెద్దన్నగా భరోసా కల్పిస్తూ నేనున్నానంటూ గృహప్రవేశానికి హాజరై నూతన వస్త్రాలు అందించారు. అందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణా: క్యాన్సర్ను సకాలంలో గుర్తించి చికిత్స పొందాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం చల్లపల్లి మండలం వక్కలగడ్డలో పీఏసీఎస్ చైర్మన్ మల్లుపెద్ది దుర్గామహేష్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో – అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారిచే ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని వెంకట్రామ్ ప్రారంభించారు.
NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం ఆజాద్ విద్యలో అనేక మార్పులు తీసుకువచ్చి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సంకల్పంతో విధులు నిర్వహించారని కొనియాడారు.
కోనసీమ: అమలాపురం కలెక్టరేట్లో PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలని కోరారు.
AP: విజయనగరం జిల్లా రాజాంలో పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది. ఈనెల 24 వరకు ఘనంగా అమ్మవారి జాతర మహోత్సవం జరగనుంది. ఈ క్రమంలో అమ్మవారి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలను సమర్పించారు.
ADB: కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తూ బీజేపీ చలో కామారెడ్డికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని పాయల్ శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
SRD: నారాయణఖేడ్ MLA సంజీవరెడ్డి కుమారుడి ఖేడ్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విజయపాల్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ శివారులోని వట్టినాగులపల్లిలో గల వన్ కన్వెన్షన్ వేదికగా జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. దాంపత్య జీవితం ఆనందంతో ఉండాలి ఆకాంక్షించారు.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా శ్రీలంక, సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఏడాది పల్లెకెలె స్టేడియంలో జరిగిన 6 మ్యాచ్ల్లో 5 సార్లు ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. అందుకే శ్రీలంక కెప్టెన్ కూడా ఛేజింగ్కే మొగ్గు చూపాడు. ఈ పిచ్పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 177 పరుగులుగా ఉంది.
JGL: రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుడు శ్రీకాంత్ రెడ్డి రోగులను పరీక్షించారు. అనంతరం బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. దాదాపు 200 మంది శిబిరంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. సర్పంచ్ తలారి నాగమణి, ఉపసర్పంచ్ ప్రణయ్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
BDK: ఇల్లందు కరెంట్ ఆఫీస్ ఏరియాలో ఐ ఎన్ టీ వీ సీ ట్రాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని నూతన ట్రాలీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నుకోబడిన వారిని శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ.. యూనియన్ ద్వారా ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
NZB: వేల్పూర్ మండలం పచ్చల నడుకుడలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు టక్కరి గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్ కిషన్ చేతుల మీదుగా లబ్ధిదారులు ఆలీ నరహరికి ₹ 26,000, ముసుకు నవీన్కు ₹ 9,000 విలువైన చెక్కులను అందజేశారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
TG: ఇబ్రహీంపట్నం మాజీ MLA మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డికి ఇవాళ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్ ఎపిసోడ్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులో విచారణకు హాజరై తమ వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ భామలు భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటించనుండగా.. మరో కీలక పాత్రలో సీనియర్ నటి మాధురి దీక్షిత్ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జూన్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
NRPT: దామరగిద్ద మండలంలోని అంబా భవానీ ఆలయంలో భవానీ మాత విగ్రహ 25వ వార్షికోత్సవ వేడుక ఘనంగా నిర్వహించబడింది. అమ్మవారికి మంగళహారతులు, బండారు, చందనం, అభిషేక పూజలు చేశారు. ప్రభురాజ్, రఘునాథ్ రావు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం అందజేశారు. ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.