బాలీవుడ్ చిత్రాలు ఇప్పటివరకు మొదటి రోజే వంద కోట్ల క్లబ్లో చేరలేకపోయాయి. అయితే, ‘దురంధర్ 2’ బాలీవుడ్ నుంచి ఆ మైలురాయిని అందుకునే మొదటి చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తొలి రోజు కేవలం హిందీ వెర్షనే సుమారు రూ.80 కోట్ల వసూళ్లు సాధిస్తుందని, ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్ల ద్వారా మొత్తంగా రూ. 100 కోట్ల మార్కును దాటుతుందని పేర్కొంటున్నాయి.
వేతనాలపై సినీ వర్కర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం డబుల్ కాల్షీట్, 9-9 కాల్షీట్, 4 గంటలకు అదనపు కాల్షీట్ ఇవ్వాలని కోరింది. అడిగిన వేతనాలు ఇచ్చినవారికే పనిచేస్తామని.. ఇది నిరసన కాదని, కొత్త వేతనాలపై తమ నిర్ణయమని తెలిపింది. మార్చి 1 నుంచి కొత్త వేతనాలకు పనిచేస్తామని పేర్కొంది. నిర్మాతలకు అభ్యంతరం ఉంటే యూనియన్లతో మాట్లాడాలని సూచించింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ ప్రాణస్నేహితుల పెళ్లిలో వీరిద్దరూ సందడి చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో పంచుకున్న వివాహ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్నేహితుల బంధం, వేడుకలోని వీరి ఉత్సాహం అభిమానులను ఆకట్టుకుంటోంది.
మెగా హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా K.P. రోహిత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సంబరాల యేటిగట్టు’. ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ ప్రస్తుతం భారీ ఎత్తున జరుగుతోంది. ఏకంగా 35 రోజుల లాంగ్ షెడ్యూల్లో రూ.20 కోట్లకుపైగా బడ్జెట్తో 18 గ్రాండ్ సెగ్మెంట్స్గా దీన్ని తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ఈ క్లైమాక్స్ ఉండనున్నట్లు టాక్.
కన్నడ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా టికెట్ ధరలపై బెంగళూరులో జోరుగా చర్చ సాగుతోంది. మల్టీప్లెక్స్లలో టికెట్ ధర దాదాపు రూ.1200 వరకు ఉండవచ్చని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమా కావడంతో, క్రేజ్కు తగ్గట్టుగా ప్రీమియం స్క్రీన్లలో ఈ స్థాయిలో ధరలు ఉండే అవకాశం ఉందని టాక్.
BTS స్టార్ జంగ్కుక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన కొత్త ఆల్బమ్ ‘అరిరంగ్’ విడుదల కానున్న నేపథ్యంలో.. మేనేజ్మెంట్ నిబంధనలకు అతీతంగా స్వేచ్ఛగా జీవిస్తానని, ప్రాణహాని ఉన్నా లెక్కచేయనని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. ఆయన భద్రతపై భయపడుతున్న ఫ్యాన్స్, సోషల్ మీడియా వేదికగా జంగ్కుక్కు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంపికపై హీరోల ఆధిపత్యం గురించి నటి తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్ల తలరాతలు హీరోల చేతుల్లోనే ఉంటాయని, స్టార్ డైరెక్టర్లు అయితే తప్ప మిగతా సమయాల్లో హీరోల మాటే చెల్లుతుందని పేర్కొంది. మగాళ్ల రాజ్యంలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉందని, హీరోలకు నచ్చకపోతే అవకాశం వచ్చినా తొలగిస్తారని కుండబద్ధలు కొట్టింది.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవడంపై నటుడు విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశాడు. మోదీ ఆశీస్సులు తీసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని, తన తల్లిదండ్రులకు ఆయన లేఖ రాయడం విశేషమని పేర్కొన్నాడు. అమిత్ షాతో సినిమా, సంస్కృతిపై చర్చించానని.. ఆయన కానుకగా ఇచ్చిన గణేష్ విగ్రహాన్ని తమ పూజా గదిలో ఉంచామని తెలిపాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారు.
తన వ్యక్తిగత జీవితం గురించి నటి అమలా పాల్ ఆసక్తికర విషయాలు పంచుకుంది. జగత్ దేశాయ్తో డేటింగ్ ప్రారంభించిన నెల రోజులకే తాను గర్భం దాల్చినట్లు తెలిపింది. ఆ తర్వాతే 2023 నవంబర్ 5న తమ వివాహం జరిగిందని, 2024 జూన్ 11న మగబిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతోంది.
విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘విష్ణు విన్యాసం’ చిత్రం లీకుల వివాదంలో చిక్కుకుంది. షూటింగ్ సమయంలోనే చిత్ర సన్నివేశాలు బయటకు రావడంతో యూనిట్ తీవ్ర మానసిక క్షోభకు గురైనట్లు నిర్మాత సుమంత్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిర్యాదు చేసినా ఫలితం లేక సినిమాను త్వరగా పూర్తి చేయాల్సి వచ్చిందని, ‘మృత్యుంజయ్’ చిత్రంతో పోటీ పడాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు.
‘విష్ణు విన్యాసం’ లీక్ అవ్వడం వల్ల నిర్మాతను బ్లాక్మెయిల్ చేశారని శ్రీవిష్ణు చెప్పాడు. అందుకే వారం వ్యవధిలోనే తన 2 మూవీలను విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. చెన్నై నుంచి మూవీని లీక్ చేసి, ప్రతి రీల్కు డబ్బుల కోసం వేధించారన్నాడు. ఈ ఒత్తిడి వల్ల 20 రోజుల షూటింగ్ను రాత్రింబవళ్లు శ్రమించి 7 రోజుల్లోనే పూర్తి చేశామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు.
రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ మూవీ 2026 మార్చి 19న విడుదల కానుంది. ‘ధురంధర్’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. దీనికి సెన్సార్ బోర్డు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. అలాగే ఈ మూవీ రన్ టైం 3:40 గంటలుగా లాక్ చేసినట్లు టాక్. మొదటి భాగం(3:34 గంటలు)తో పోలిస్తే 6 నిమిషాలు ఎక్కువట.
ప్రభాస్, సందీప్ వంగా క్రేజీ కాంబో ‘స్పిరిట్’ నుంచి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో వివేక్ సరసన కనిపించిన నటి గురించే చర్చ నడుస్తోంది. ఆమె ఇండో-అమెరికన్ నటి ఐశ్వర్య దేశాయ్. ‘గల్లీ బాయ్’ ఫేమ్ అయిన ఈ నటి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్, ఆమె కలిసి ప్రభాస్ను గట్టిగా ఢీకొట్టబోతున్నారని టాక్.
హిందీ నిర్మాత దీపక్ ముకుత్ త్వరలో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. బాబీ డియోల్, అభిషేక్ బచ్చన్ కాంబోలో ‘దో ఔర్ దో పాంచ్’ సినిమాను రీమేక్ చేయాలని ఆయన పదేళ్లుగా భావిస్తున్నాడట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ఇద్దరు హీరోల క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాని, సుజీత్ కాంబోలో వస్తున్న ‘బ్లడీ రోమియో’పై అంచనాలు పెరిగిపోయాయి. సుజీత్ తాజాగా ప్రభాస్, పవన్ కళ్యాణ్, నానిల ఫోటోను షేర్ చేయడంతో తన ‘సినిమాటిక్ యూనివర్స్’పై హింట్ ఇచ్చినట్లయింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గనుక ‘సాహో’, ‘OG’ సినిమాలతో లింక్ అయితే నాని కెరీర్లోనే భారీ హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం. ఈ అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.