సీనియర్ నటి పావలా శ్యామల ఆర్థిక కష్టాల్లో ఉన్నారనే విషయం తెలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే స్పందించాడు. ఆమె కుటుంబ దీనస్థితిని చూసి చలించిన ఆయన, శ్యామల , ఆమె కుమార్తె నిత్యావసరాలు, వైద్య ఖర్చుల కోసం ప్రతి నెలా 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందేలా శాశ్వత ఏర్పాట్లు చేశాడు. కష్టాల్లో ఉన్న తోటి కళాకారిణికి అండగా నిలిచి బన్నీ తన ఉదారతను చాటుకున్నాడు.
రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ మూవీలోని ‘రై రై రా రా’ పాట విడుదలైన 24 గంటల్లోనే 46.1 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. విశేషమేమిటంటే, రెండో స్థానంలో కూడా ఇదే సినిమాలోని ‘చికిరి చికిరి’ (29.19 మిలియన్ వ్యూస్) నిలిచింది. మూడో స్థానంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలోని ‘దేఖ్లేంగ...
‘సలార్ 2’పై నిర్మాత విజయ్ కిరగందూర్ కీలక ప్రకటన చేశాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని, మొదటి భాగం రూ. 700 కోట్లు వసూలు చేయడంతో రెండో భాగాన్ని అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ క్వాలిటీ విషయంలో రాజీపడరని, అందుకే కొంత ఆలస్యమైందని స్పష్టం చేశాడు. ప్రభాస్-హోంబలే ఫిల్మ్స్ డీల్లో ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకం కానుంది.
ఐపీఎల్ ప్రియులకు జియో హాట్స్టార్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. మార్చి 26 నుంచి మే 31 వరకు జరిగే ఈ సీజన్లో క్రికెట్తో పాటు వినోదాన్ని పంచేందుకు 100 మైక్రో డ్రామాలను సిద్ధం చేసింది. 60 నుంచి 180 సెకన్ల నిడివి గల ఈ ఎపిసోడ్లను మ్యాచ్ల మధ్యలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ ఇవి అందుబాటులో ఉండనున్నాయట.
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, బుచ్చిబాబు తన తదుపరి లక్ష్యంగా రెబెల్ స్టార్ ప్రభాస్ను ఎంచుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడని, త్వరలోనే కథ వినిపించనున్నాడని తెలుస్తోంది. ‘పెద్ది’ భారీ విజయం సాధిస్తే, ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కడం ఖాయమని టాలీవుడ్ వర్గాల టాక్.
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం. నన్ను నమ్మి బాధ్యత ఇచ్చిన సంస్థకు మంచి అవుట్పుట్ ఇవ్వాలని టీచర్లా కష్టపడి పనిచేశాను. పెట్టిన ఖర్చంతా స్క్రీన్పై కనిపిస్తుంది. మాట ఇచ్చినట్లుగానే మంచి చిత్రాన్ని తీశాను’ అని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ‘ఈ యుద్ధం నిజానికి జీసస్, అల్లా మధ్య జరుగుతున్న పోరాటం వంటిది. ఇందులో ఎవరు గెలిస్తే నేను ఆ మతంలోకి మారిపోతాను’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘RC17’ చిత్రంపై క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో హీరోయిన్గా బాలీవుడ్ భామ కృతి సనన్ నటించనున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ మార్క్ మాస్ ఎమోషన్స్తో పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని టాక్.
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ మూవీ మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా టీవీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకోగా.. మార్చి 8న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించాడు.
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. 2026 మార్చి 19న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను 2026 జూన్ 4కి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ నోట్ రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26, 2026న విడుదల కానుంది. మార్చి 22న ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ను అత్యంత భారీగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ప్రమోషన్స్ కోసం పవన్ స్వయంగా రెండు రోజులు కేటాయించారనే వార్త సినిమాపై హైప్ అమాంతం పెరిగింది. పవర్ స్టార్ ప్రచార బరిలోకి దిగడం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
జీ సినీ అవార్డ్స్ 2026 వేదికగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ఉత్తమ నటి అవార్డను గెలుచుకుంది. ‘తేరే ఇష్క్ మే’ మూవీలో నటనకు గాను ఈ అవార్డు లభించింది. అయితే, ఆమెను విజేతగా ప్రకటించగానే SMలో విమర్శలు హోరెత్తాయి. ఈ అవార్డుకు యామీ గౌతమి అర్హురాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘హక్’ మూవీలో యామీ నటన అద్భుతమని, ఆమెను కాదని కృతికి అవార్డు ఇవ్వడం సరికాదని మండిపడుతున్నారు.
సన్నీ లియోన్ కుమార్తె నిషా(9) ‘బూ బాక్స్’ అనే టిష్యూ హోల్డార్ను కనిపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టిష్యూ వాడుకున్న తర్వాత పక్కనే పడేసేలా చిన్న డస్ట్ బిన్ కలిపి ఉండేలా దీన్ని డిజైన్ చేసింది. దీనికి అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా లభించాయి. అలర్జీ సమస్యతో టిష్యూలు వాడే క్రమంలో వచ్చిన ఈ ఆలోచన ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్గా మారి నిషాకు డబ్బును తెచ్చిపెడుతోంది.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు చేసింది. మన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిసినప్పుడు బాధగా అనిపిస్తుందంటుందని తెలిపింది. కొన్నాళ్లుగా ఆమె సోదరుడు అర్జున్ కపూర్ SMలో ట్రోల్స్కి గురవుతున్న నేపథ్యంలో ఆమె స్పందించింది. అలాంటి వేధింపులను క్షమించాల్సిన అవసరం లేదని చెప్పింది. అలాగే, ఇలాంటి నెగిటివిటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకొచ్చింది.
విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ ఇవాళ హైదరాబాద్ లోని బంజారాహిల్ల్ తాజ్ కృష్ణ హోటల్ లో ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 26న ఉదయపూర్ లో వివాహం చేసుకున్న ఈ జంట, నేడు సినీ, రాజకీయ ప్రముఖులకు విందు ఇవ్వనుంది. భద్రత దృష్ట్యా అతిథులకు పంపిన వన్ టైమ్ QR కోడ్ స్కాన్ చేసిన తర్వాతే లోపలి అనుమతిస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.