• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వైసీపీపై మంత్రి అనగాని ఫైర్

BPT: వైసీపీ అబద్ధాల పునాదుల మీద పుట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గత పాలకుడు రాష్ట్రాన్ని అంధకారం చేశారని మండిపడ్డారు. అందుకే ప్రజలు జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు. కౌన్సిల్ హాల్‌లోకి చెప్పులు, దేవుడి ఫోటోలతో వచ్చి వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

February 22, 2026 / 05:54 PM IST

అన్ని మతాలకు కూటమి ప్రభుత్వ గౌరవం: ప్రత్తిపాటి

PLD: చిలకలూరిపేట మండలం రాజాపేటలో ఆదివారం జరిగిన మహా కూటములకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. దేవుని వాక్యంతో ప్రజల కష్టాలు తొలగి, రక్షణ లభిస్తుందని ఆయన అన్నారు. తమ కూటమి ప్రభుత్వం అన్ని మతాలను, వర్గాలను సమానంగా గౌరవిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం పేదల ఆరోగ్యం, సంతోషం కోసం ప్రార్థనలు నిర్వహించారు.

February 22, 2026 / 05:52 PM IST

‘ప్రతి ఒక్కరూ ప్రధాని మన్ కీ బాత్ వీక్షించాలి’

కోనసీమ: రామచంద్రపురం పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు దునే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం మోడ్రన్ విద్యాసంస్థల అధినేత జీవీ రావుని కలిసి విద్యార్థులకు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన్ కీ బాత్ ప్రతి ఒక్కరూ వీక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు గానాల కళ్యాణ్ పాల్గొన్నారు.

February 22, 2026 / 05:51 PM IST

నరసింహారెడ్డి వర్ధంతిని నిర్వహించిన రెడ్డి సంఘం

అనంతపురం నగరంలో ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఘనంగా నిర్వహించారు. లలిత కళాపరిషత్ నుంచి విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కన్వీనర్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

February 22, 2026 / 05:50 PM IST

రేపు యధావిధిగా PGRS : కలెక్టర్

W.G: భీమవరం కలెక్టరేట్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్, వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు.

February 22, 2026 / 05:44 PM IST

నూతన గంగమ్మ దేవస్థానం ప్రతిష్టా మహోత్సవం

NDL: డోన్ బట్టీల సెంటర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవస్థానం అమ్మ వారి విగ్రహ, ధ్వజ ప్రతిష్ట మహోత్సవంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు ఇవాళ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్,మున్సిపల్ ఛైర్మన్, ఎంపీపీ,జడ్పిటీసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అభిమానులు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:42 PM IST

ఘనంగా సర్పంచ్‌లకు సన్మానం

VZM: బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. సర్పంచుల పదవీకాలం మార్చి నెలలో పూర్తికానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్పంచ్‌లకు బొండపల్లి ఎంపీపీ చల్ల చల్లంనాయుడు, పలువురు అధికారులు సర్పంచులకు సాలువల కప్పి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు.

February 22, 2026 / 05:41 PM IST

‘రేపు పుట్టపర్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్‌, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 05:40 PM IST

డిగ్రీలతో ఉద్యోగాలు రావు: మాజీ ఉప రాష్ట్రపతి

ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం డిగ్రీలతోనే ఉద్యోగాలు రావని, నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని తెలిపారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకుని వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.

February 22, 2026 / 05:38 PM IST

సిమెంట్ రోడ్డును ప్రారంభించిన ఇంఛార్జ్ మంత్రి

CTR: నగరపరిధిలో 40వ వార్డులో రూ.9.55 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుడా ఛైర్‌పర్సన్ కఠారి హేమలత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, స్థానిక టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:36 PM IST

‘ఇంటర్ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేశాం ‘

ELR: ఈ నెల 22 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు జంగారెడ్డిగూడెంలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పరీక్షల కస్టోడియన్ శ్రీనివాసరావు చలమాల తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫస్ట్ ఇయర్ 2,357 మంది, సెకండ్ ఇయర్ 2,191 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.

February 22, 2026 / 05:36 PM IST

డ్రోన్ కెమెరాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ

కడప: నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నింగి నుండి నిఘా ఉంచుతూ.. అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DSP వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

February 22, 2026 / 05:35 PM IST

‘భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తుంది’

ప్రకాశం: భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడానికి ఎవరికీ హక్కు లేదని, ప్రజల భావోద్వేగాలతో రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించడం తగదని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివారం ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సిగ్గుచేటని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 05:34 PM IST

అప్పుల‌కు లెక్కలు చెప్పే దమ్ముందా..?

VSP: కూటమి ప్రభుత్వం 20 నెలల్లో చేసిన రూ.3.28 లక్షల కోట్ల అప్పులకు లెక్కలు చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు సవాల్ చేశారు. ఆదివారం విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదాయ వృద్ధి కేవలం 1.97% ఉండగా 11.09% జీఎస్డీపీ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3.39 లక్షల కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు.

February 22, 2026 / 05:33 PM IST

చంద్రగిరిలో పశువుల పండుగ సంబరాలు

TPT: చంద్రగిరి పట్నంలో పశువుల పండుగ సంబరాలకు ఎమ్మెల్యే తనయుడు పులివర్తి వినిల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం మిట్టమీద గంగమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని పశువుల పండుగను తిలకించారు. ఈ సందర్భంగా పండుగను వీక్షించడానికి తరలివచ్చిన ప్రజలకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ప్రజలను, కార్యకర్తలను అభిమానంగా పలకరించారు.

February 22, 2026 / 05:32 PM IST