తూ.గో: రాజమండ్రిలో ప్రజలను కలవరపెడుతున్న అనూరియాపై మంత్రి దుర్గేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిస్థితిపై సోమవారం కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టిందని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని ఆయన భరోసా ఇచ్చారు.
కడప: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ మాఫియా విచ్చలవిడిగా దోపిడీ చేస్తోందని ఆరోపిస్తూ ఈ నెల 28న డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు.
W.G: భీమవరంలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారు, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మాస్ కాపీయింగ్ జరుగుతుందా అనే కోణాల్లో పట్టణంలోని కళాశాలలో తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, సౌకర్యాల ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలించారు.
SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది ప్రజలు కేంద్ర మంత్రికి తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు. వాటిని పరిశీలించి, అవసరమైన వాటిని సత్వరమే పరిష్కరించారు.
KRNL: కౌతాళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన బియ్యాన్ని పక్కదారి పట్టించిన ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని AISF నాయకులు ఇవాళ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
VZM: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంకలాం లేఔటులో “కార్డన్ అండ్ సెర్చ్” కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇంఛార్జ్ డీఎస్పీ ఆర్. గోవిందరావు ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసు సిబ్బంది ఒకేసారి ఇండ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. రికార్డులు సక్రమంగా లేని 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి, 8 మందిని అరెస్ట్ చేశారు.
KDP: పులివెందులలోని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్పై ఏసీబీ దాడి నిర్వహించింది. లంచం తీసుకుంటున్న సమయంలో రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్సై అనిల్ కుమార్లను అధికారులు పట్టుకున్నారు. లంచం సొమ్మును సీజ్ చేసి, కేసుపై విచారణ కొనసాగుతోంది.చైన్ స్నాచింగ్ కేసు దర్యాప్తులో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు.
ELR: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి, వినతిపత్రం అందించారు. రైతులకు అన్నదాత సుఖీభవ గత ఏడాది బకాయిలు చెల్లించాలని, రైతులకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.
NDL: నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 25 వ తేదీన జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో భారీ ఉద్యోగం మేల నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. ప్రముఖ కంపెనీల నుంచి సుమారు 550 పోస్టుల భర్తీకి ఈ మేలా జరుగుతుందన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఫైనల్ ఇయర్ చదువుతున్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
విశాఖలోని ‘మిలాన్–2026’, ‘ఐఎఫ్ఆర్’ వేడుకల సందర్భంగా భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ వికాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్తో పాటు పలు స్నేహ దేశాలకు చెందిన 80 మందికి పైగా మీడియా ప్రతినిధులు నౌకను సందర్శించారు. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన విధానాన్ని ఈస్టర్న్ నేవల్ అధికారులు నౌక ప్రత్యేకతలను జర్నలిస...
అన్నమయ్య: మదనపల్లిలో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టమాటా ధరలు భారీగా పడిపోవడంతో పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో బహుజన్ యువసేన (BYS) ఆధ్వర్యంలో నాయకులు, రైతులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు తక్షణ సహాయం అందించాలని కోరారు.
WG: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నరసాపురం డీసీసీబీ బ్రాంచ్ వద్ద సహకార సంఘాల ఉద్యోగులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు తమ నిరసనను తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని, పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
సత్యసాయి: పెనుకొండలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ సోమవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. యూనియన్ అధ్యక్షురాలు జయమ్మ, కార్యదర్శి బావమ్మ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు అర్హతల సడలింపు ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు.
అన్నమయ్య: జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్లో సోమవారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్ నేపథ్యంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబ్ డిస్పోజల్, డాగ్ స్వాడ్ బృందాల తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. బెదిరింపు పుకారేనని అధికారులు నిర్ధారించగా, ప్రజలు ఆందోళన చెందవద్దని ఎస్పీ ధీరజ్ సూచించారు.
AKP: మాతా, శిశు మరణాల నివారణకు సకాలంలో సేవలు అందించాలని జిల్లా టాస్క్ ఫోర్స్ ప్రధాన అధికారి డాక్టర్ జె.ప్రశాంతి సూచించారు. సోమవారం టాస్క్ ఫోర్స్ బృందం హరిపాలెం పీహెచ్సీ పరిధిలోని ఎం.జగన్నాధపురం విలేజ్ హెల్త్ క్లినిక్ను సందర్శించారు. గర్భిణీలు, పిల్లల నమోదు, హైరిస్క్ కేసుల గుర్తింపు, ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు.