NLR: కావలి అగ్నిమాపక స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మైనంపాటి సుధాకర్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మైనంపాటి సుధాకర్ ఇటీవల విధులకు సెలవు పెట్టి కారులో హైదరాబాదుకు వెళుతుండగా మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
KDP: రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా ప్రచురించిన 2026 సంవత్సర క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మంగళవారం అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన క్యాలెండర్లను జిల్లాలోని అన్ని శాఖలకు పంపిణీ చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారికి కలెక్టర్ సూచించారు.
సత్యసాయి: పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ పేరుతో నకిలీ ఐడీ నుంచి ఈ బెదిరింపు వచ్చినట్లు సమాచారం. డీఎస్పీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో కోర్టు ఆవరణలో అణువణువు తనిఖీలు చేపట్టారు.
KDP: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 62 కేంద్రాల్లో 15,159 మంది నమోదు కాగా, 14,777 మంది హాజరై 97 శాతం హాజరు నమోదైంది. మొత్తం 382 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 14,011 మందిలో 13,691 మంది హాజరై 320 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,148 మందిలో 1,086 మంది పరీక్షలు రాయగా 62 మంది హాజరుకాలేదు.
TPT: పులికాట్ సరస్సు అంతర్రాష్ట్ర జల వివాద సమస్య పరిష్కారం కోసం ఎంపీ మద్దిల గురుమూర్తి జిల్లా కలెక్టరును కలిశారు. మత్స్యకారుల సమస్యలపై ఎంపీ చర్చలు తెలిపారు. మత్స్యకారులు సరిహద్దులు మార్చి చేపల వేట కొనసాగిస్తున్నారని కలెక్టరుకి వివరించారు. మత్స్యకారులు స్నేహభావంతో వ్యవహరించి గొడవలకు దూరంగా ఉండాలని ఎంపీ పిలుపునిచ్చారు.
PLD: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నూతన నిర్మాణానికి భక్తులు విరాళాలతో ముందుకు వస్తున్నారు. మంగళవారం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అలపర్తి వెంకటేశ్వర్లు, అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు రూ.1,01,116 నగదును ఆలయ ఈవో నలబోతు మాధవిదేవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కృష్ణా: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కృష్ణా డెల్టాలోని జల వనరుల శాఖ ఔట్ సోర్సింగ్ లస్కర్లు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈఅవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును కలిసి వినతిపత్రం అందచేశారు. తమకు ఏడాదిలో 8-10 నెలలు కాకుండా 12నెలలకూ జీతాలు ఇవ్వాలని కోరారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని కోరారు. ప్రభుత్వం జీతాలు సకాలంలో ఇవ్వాలని కోరారు.
PPM: వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రధానమని, అందుకు తగిన విధంగానిర్మాణం చేపట్టాలని కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. మౌలిక వసతులతో పాటు గాలి వెలుతురు ఉండాలని తేల్చి చెప్పారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
E.G: గోకవరం మండలంలోని కొత్తపల్లి, బొమ్మల దొడ్డి హౌసింగ్ లేఅవుట్లను జిల్లా హౌసింగ్ పీడీ నాది బుజ్జి మంగళవారం సందర్శించారు. రూఫ్ లెవల్లో ఆరు, బేస్మెంట్ లెవల్లో 102 ఇళ్లు ఉన్నట్లు పీడీ తెలిపారు. నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరారు. బిల్లులు సకాలంలో అప్లోడ్ చేస్తే ఐదు రోజుల్లోనే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
AKP: గొలుగొండ(మం) నర్సింగబిల్లిలో తలుపులమ్మ తల్లి పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పెద్దలు తెలిపారు.
GNTR: గుంటూరు డొంక రోడ్డులోని వల్లూరివారితోట, కార్మిక శాఖకు చెందిన ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేసే అంశాన్ని మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ మంగళవారం పరిశీలించారు. తమ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కు నిర్మించాలని స్థానికులు ఆయనకు విన్నవించారు. అనంతరం, అస్తవ్యస్తంగా ఉన్న 5వ లైన్ను కూడా కమిషనర్ స్వయంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.
W.G: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంకెం సీతారాం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో జరుగుతున్న ఏఐసీసీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ఇరువురు నేతలకు జ్ఞాపికలను అందజేశారు.
ELR: కైకలూరు మండలం పందిరిపల్లిగూడెంలో ఏకీకృత కుటుంబ సర్వే చేస్తున్న సచివాలయ సిబ్బందిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 21న సర్వే చేస్తుండగా.. మా వివరాలు మీకెందుకు చెప్పాలని గ్రామస్థుడు బలే సాయికుమార్ తమపై దాడిచేసినట్లు సిబ్బంది టి.సురేశ్, సీహెచ్ గోపాలకృష్ణలు ఆరోపించారు. ఈ మేరకు సాయిపై రూరల్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
నెల్లూరు రూరల్ 24వ డివిజన్ కనుపర్తిపాడులో రూ.22.50 లక్షలతో ఎస్టీ కాలనీ శ్మశానానికి ప్రహరీ నిర్మిస్తున్నారు. ఈ పనులను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలో రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి కాపాడమని చెప్పారు.
అనంతపురం డీఈఐసీ కేంద్రాన్ని ప్రోగ్రాం అధికారి డా. విష్ణుమూర్తి సందర్శించి వైద్య సేవలను పర్యవేక్షించారు. జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా పిల్లలకు అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు. శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు డా.నాగ శశిభూషణ రెడ్డి సమక్షంలో మాత్రలు అందజేశారు. అలాగే 28 మంది చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించారు.