CTR: అరగొండ ఏ.గొల్లపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనారోగ్యంతో మంచానికే పరిమితమై ఉన్నందున పింఛన్ మంజూరు చేయాలని ఆయన భార్య లోకేశ్వరి కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. శస్త్రచికిత్స అనంతరం భర్త చేతులు, కాళ్లు పనిచేయక కుటుంబ పోషణ కష్టంగా మారిందని తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలని ఆమె కోరారు.
NTR: పాల కేంద్రాల్లో పాలు కల్తీ జరగకుండా, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలపై పశుసంవర్ధక శాఖ వైద్యుడు అభిలాష్ మంగళవారం తిరువూరులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు కల్తీయా కాదా అని గుర్తించే విధానాలపై పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. కల్తీ పాలు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు.
KRNL: ఎమ్మిగనూరులోని సంజీవయ్య నగర్ మున్సిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. రోడ్లు, కాలువలు, నీటి సరఫరాను పరిశీలించారు. ఆయా వార్డులలోని సమస్యలపై ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. డీఈఈ రాజు నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఏఈ ప్రతాప్, సిబ్బంది ఉన్నారు.
E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అనపర్తి శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో పీఎం మన్ కీ బాత్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా BJP జిల్లా కార్యదర్శి హేమ తులసి విద్యార్థిని, విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా త్వరలో బహుమతులు అందజేస్తామన్నారు.
VSP: క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేసిన భారీ కుంభకోణం విశాఖలో వెలుగుచూసింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రవి కిరణ్ను సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. బాధితులు సీపీకి నేరుగా ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
సత్యసాయి: చేనేత కార్మికుల సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేశ్ తీసుకెళ్లారు. సుమారు రూ.220 కోట్ల ఆప్కో బకాయిలు చెల్లించాలని, ఎన్నికల హామీ మేరకు కార్మికులకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.
VZM: చీపురుపల్లిలో జరుగతున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది అమ్మవారి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు.
BPT: వైద్య ఖర్చుల వల్ల ఏ పేదవాడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నేత అనగాని శివప్రసాద్ అన్నారు. రేపల్లెలో మంగళవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో మంజూరైన రూ.19,09,257 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలను 29 మంది లబ్ధిదారులకు ఆయన అందజేశారు. సీఎం చంద్రబాబు సంకల్పంతో అర్హులందరికీ సకాలంలో వైద్య సాయం అందుతోందన్నారు.
CTR: మెరుగైన ఉపాధి కోసం విజయపురం(మం) పన్నూరు సబ్స్టేషన్ నందు గల ప్రభుత్వ ఐటీఐ నందు చేరాలని ట్రైనింగ్ అధికారి మునికృష్ణయ్య పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థులకు కేరియర్ గైడెన్స్ అవగాహన నిర్వహించారు. రెండు సంవత్సరాలు, ఒక సంవత్సరం కోర్సుసు కలవని అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారి మురళి పేర్కొన్నారు.
కడప: జిల్లా యువతకు నైపుణ్య వేదికగా నిలవనున్న ‘స్టార్ట్ అప్ కడప’ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్షించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల వేగం, నాణ్యతపై సూచనలు ఇచ్చారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించారు.
సత్యసాయి: కదిరి మండలం యాకలచెరువుపల్లిలో YCP కార్యకర్తలపై జరిగిన దాడిని నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన గ్రామాన్ని సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం బాధితులతో కలిసి కదిరి డీఎస్పీ శివ నారాయణ స్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మక్బూల్ డిమాండ్ చేశారు.
SKLM: జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి 18 మంది ప్రజలు ఆసుపత్రి పాలు కావడానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రహదారి మరమ్మతు పనులతో తాగునీరు కలుషితమవుతుందని తెలిసినా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
E.G: రాజమండ్రిలో ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసుల నేపథ్యంలో కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రవిరాజు మంగళవారం బాధితులను సందర్శించారు. కలెక్టర్ కీర్తి చేకూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిశీలించారు. సరైన ప్రోటోకాల్తో వైద్యం అందుతోందని స్పష్టం చేశారు. అనుసరించాల్సిన విధానాలపై స్థానిక వైద్యులకు పలు సూచనలు చేశారు.
NLR: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఏపీలో అమలవుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం నెలకు రూ.1400 కోట్లు ఖర్చు పెడితే, మన ప్రభుత్వం రూ.2750 కోట్లు ఖర్చుపెడుతోందన్నారు. అర్హులందరికీ పించన్ అందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
NDL: కొలిమిగుండ్ల పట్టణంలో ఇవాళ తాగునీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా బీసీ కాలనీ, శాంతినగర్, నాయి బ్రాహ్మణ కాలనీలలో పైపులు లీకేజీ కావడంతో త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారు. గ్రామ సర్పంచ్ శివ రాముడు వెంటనే లీకేజీ ఉన్న ప్రదేశంలో పైపులను మరమ్మతులు చేస్తున్నారు. వేసవికాలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని గ్రామస్తులు అధికారులను కోరారు.