• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బీసీ సెల్ కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు బీసీ సెల్ అధ్యక్షుడు సంగేపు రంగారావు, ప్రధాన కార్యదర్శి వనకూరు విక్రమ్,కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చేరేలా కృషి చేయాలన్నారు.

February 20, 2026 / 07:39 PM IST

ఆ ఘనత ఏపీకే దక్కుతుంది: ఎమ్మెల్యే

KRNL: పేదల సంక్షేమానికి అత్యధికంగా నగదు బదిలీ పథకం విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత ఏపీ రాష్ట్రానికే దక్కుతుందని ఆదోని MLA పార్థసారథి ఇవాళ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తొలి ఏడాదిలోనే అమలు చేసి చూపించారన్నారు. గత YCP ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ కింద రూ. 26 వేల కోట్లు వృథా చేశారన్నారు.

February 20, 2026 / 07:36 PM IST

తిరుమలలో మోసం.. ముగ్గురు అరెస్ట్

TPT: తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు తీసుకుని అధిక ధరలకు అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ ఆధార్ కార్డులతో రూ.50/100 చెల్లించి గదులు తీసుకుని, ఒక్కో గదిని రూ.1,000 నుంచి రూ.3,000 వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే గదిని పలువురికి ఇచ్చి మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని వారు పేర్కొన్నారు.

February 20, 2026 / 07:33 PM IST

‘దాడికి పాల్పడిన ఎస్ఎఫ్ఐ గుండాలను అరెస్టు చేయాలి’

SKLM: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై సామూహికంగా దాడి చేసిన ఎస్ఎఫ్ఐ గుండాలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిగిలిపల్లి మదన్ కుమార్ డిమాండ్ చేశారు. టెక్కలిలోని ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:33 PM IST

సోలార్ సమస్యల పరిష్కారం కోసం ‘1912’ టోల్ ఫ్రీ నంబరు

అనంతపురం జిల్లాలోని సోలార్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబరు ‘1912’ అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి శుక్రవారం తెలిపారు. వినియోగదారులు ఈ నంబరుకు కాల్ చేసి ఐవీఆర్ఎస్‌లో 5 అంకెను నొక్కి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. దీని ద్వారా సోలార్ విక్రేతలు నిర్ణీత సమయంలోగా సమస్యను పరిష్కరిస్తారని వివరించారు.

February 20, 2026 / 07:30 PM IST

జాతీయ లోక్ అదాలత్‌పై ఎక్సైజ్ శాఖతో సమావేశం

తూ.గో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మార్చి 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నిమిత్తం ఎక్సైజ్ అధికారులతో శుక్రవారం సమావేశమైయ్యారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. రాజీ పడదగిన కేసులను గుర్తించి జాతీయ న్యాయ సేవాధికార సంస్థకు సమాచారం ఇవ్వాలన్నారు.

February 20, 2026 / 07:30 PM IST

జొన్నవాడ కామాక్షమ్మకు వెండి వస్తువు బహుకరణ

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షమ్మ అమ్మవారికి శుక్రవారం వెండి వస్తువును బహుకరించారు. పొదలకూరు వాస్తవ్యులు కర్ణం కామాక్షి ఆర్థ్య, పేరున కర్ణం కామాక్షి కార్తిక్ శ్రీ స్వామి అమ్మవార్ల పై భక్తి తో నిత్య ఆర్జిత సేవల్లో ఉపయోగించిటకు సుమారు 94 గ్రాములు విలువైన వెండి వస్తువును అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు దర్శనం కల్పించారు.

February 20, 2026 / 07:30 PM IST

రేపు జరుగుమల్లిలో పర్యటించనున్న మంత్రి

ప్రకాశం: జరుగుమల్లిలో శనివారం మంత్రి స్వామి స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని క్యాంప్ కార్యాలయ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారన్నారు. అనంతం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు అర్జీల సేకరణ ఉంటుందన్నారు.

February 20, 2026 / 07:30 PM IST

ఈ నెల 25న మెగా జాబ్ మేళా

PLD: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25న మాచర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజి రావు, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస రావు శుక్రవారం తెలిపారు.

February 20, 2026 / 07:27 PM IST

బంగారు నగలు చోరీ.. కేసు నమోదు

KDP: పోరుమామిళ్ల మండలం పులివీడు గ్రామంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. బైకుపై వెళ్తున్న మహిళ మెడలో ఉన్న సుమారు 22 గ్రాముల బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. దీంతో సమాచారం అందుకున్న పోరుమామిళ్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

February 20, 2026 / 07:26 PM IST

అహోబిలంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

NDL: ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం సాయంత్రం నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో అంకురార్పణతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. అనంతరం సెల్వార్ కూత్ ఉత్సవం నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 20, 2026 / 07:26 PM IST

GDCC బ్యాంక్ కేసులో మరో అరెస్ట్

GNTR: నల్లపాడు GDCC బ్యాంక్‌లో నిధుల దుర్వినియోగం కేసులో వెలిసెల ఏడుకొండలను పోలీసులు గురువారం GT రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. 28 నవంబర్ 2025న నమోదైన కేసులో బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరెస్టైన నిందితుడిని కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ ఆదేశించారు. మిగతా నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

February 20, 2026 / 07:23 PM IST

హనుమాన్ జంక్షన్‌లో సీఐ కార్యాలయం ప్రారంభం

కృష్ణా: హనుమాన్ జంక్షన్‌లో దాతల సహకారంతో రూ.కోటితో నిర్మించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, స్థానికులతో కలిసి దాతలను ఘనంగా సన్మానించారు. ఈ భవనం వల్ల హనుమాన్ జంక్షన్ పరిధిలో పోలీసు సేవలు మరింత వేగవంతంగా అందనున్నాయి.

February 20, 2026 / 07:21 PM IST

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

E.G: ఇటీవల హాస్పటల్స్‌లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం సీఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 61 మందికి రూ.37,19,880 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు కాగా చెక్కులను శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:19 PM IST

కే.రామభద్రపురం కేంద్రాన్ని తనిఖీ చేసిన జేసీ

PPM: ప్రభుత్వ వైద్యం పేదలకు వరమని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా మెలగాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం కొమరాడ(మం) కే.రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

February 20, 2026 / 07:17 PM IST