కృష్ణా: మొవ్వ మండలంలోని ZPH పాఠశాలలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్ప్రభావాలపై విద్యార్థులకు ఎస్ఐ సి.హెచ్. సురేశ్ వివరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.
NTR: విజయవాడలోని హోటల్ వివాంతాలో ఏపీ రాష్ట్రానికి సంబంధించి భూగర్భ జలాల డేటా ఆక్సిఫర్ మ్యాపింగ్ ఫలితాల ప్రచారంపై వర్క్ షాప్ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ వాటర్ బోర్డ్ సభ్యుడు వరదరాజ్ మాట్లాడుతూ.. భూగర్భ జలాల వనరుల అంచనా, సువర్ణ నిర్వహణ వినియోగానికి కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పద్ధతులను విస్తారంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
కడప YVUలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ.టి.శ్రీనివాస్ తెలిపారు. AP నైపుణ్యాభివృద్ధి సంస్థ, YVU ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున్నాయన్నారు. టెన్త్ నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. పూర్తి సమాచారం కోసం 6300125455, 94405 16153 నంబర్లలో సంప్రదించాలన్నారు.
PPM: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నుంచి గ్రామస్థాయిలో రెవెన్యూ క్లినిక్లు ప్రారంభం కావాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి బుధవారం అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. ఇకపై ప్రతీ గురువారం VROలు ఆయా గ్రామాల్లో రెవిన్యూ క్లీనిక్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ప్రజల రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
అనకాపల్లి మండలం కొత్తూరులో భగవాన్ అవతార్ మెహర్ బాబా 132వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మెహర్ బాబా మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మెహర్ బాబా భక్తురాలు మాజీ ఎంపీపీ గంగుపాం జలజ మాట్లాడుతూ.. ప్రేమ, సేవలతో లోక శాంతిని పొందవచ్చునని భగవాన్ అవుతారు మెహర్ బాబా సూచించారని పేర్కొన్నారు.
W.G: ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన క్రీడోత్సవాల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు క్రికెట్ టీంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ ఆడి తన ప్రతిభను చూపారు.
TPT: మామిడి పంట పూత నుంచి పిందెకు మారుతున్నందున, నిమ్మకాయ లేదా కోడి గుడ్డు పరిమాణంలో ఉన్నప్పుడే ఫ్రూట్ కవర్లు కట్టాలని పుత్తూరు హార్టికల్చర్ అధికారి వెంకట సౌజన్య సూచించారు. దీంతో బూడిద తెగులు, ఆకుమచ్చలు, అధిక ఉష్ణోగ్రత నుంచి కాయలను రక్షించుకోవచ్చన్నారు. 7.20 లక్షల ఫ్రూట్ కవర్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
VZM: ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకున్న వారంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఇన్విజిలేటర్ల నియామకం, మూల్యాంకన ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.
KKD: మంత్రి గుమ్మడి సంధ్యారాణిని బుధవారం సచివాలయంలో ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభమర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని కోరారు. సబ్ ప్లాన్ పరిధిలోని గిరిజన గ్రామాలు వెనుకబడి ఉన్నాయని, అక్కడ నూతన పాఠశాలలు, రోడ్ల నిర్మాణం చేపట్టాలని విన్నవించారు
VSP: భీమిలిలోని బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం జేవీ అగ్రహారం వద్ద మద్యం అమ్ముతున్న వ్యక్తి నుంచి 32 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకొని అమ్మకాలు చేస్తున్న నిర్వహణని భీమిలి పోలీసులకు అప్పగించినట్లు సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. అనధికార మద్యం విక్రయాలపై సమాచారం ఇవ్వాలన్నారు.
ATP: అమరావతిలో జరుగుతున్న ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవం రెండో రోజు పోటీల్లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సందడి చేశారు. ‘ఆట విడుపు’ కార్యక్రమంలో భాగంగా సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆమె ఉత్సాహంగా త్రో బాల్ ఆడారు. నిత్యం రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులకు ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఆమె పేర్కొన్నారు.
SS: శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు జరిగే ఈ వేడుకలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
E.G: సీతానగరం మండలం ముగ్గుల సబ్స్టేషన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE నటరాజన్ తెలిపారు. రోడ్డు మరమ్మతుల కారణంగా రఘుదేవపురం, సింగవరం గ్రామాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. పనులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
BPT: కారంచేడు మండలం జరుబులవారిపాలెంకు చెందిన మనోజ్ కుమార్ను మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు వసూలు చేశారు. నియామక పత్రం, ఐడీ కార్డు ఇచ్చి క్వారీలో పని పెట్టి నెలరోజులకు రూ.18 వేలు ఇచ్చారు. తర్వాత క్వారీ మూసేయడంతో మోసం బయటపడింది. చెక్ బౌన్స్ కావడంతో మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
NLR: కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు ఢీ కొని యువకుడు మృతి చెందాడు. గూడూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న రైలు ఢీ కొనడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన యువకుడు చిన్నపడుగుపాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా స్థానికుల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీసులు తెలిపారు.