AKP: కోటవురట్ల మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో చంద్రశేఖర్ గురువారం మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ దశలో ఉన్న పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు. అలాగే నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు, పీఆర్ ఏఈ వర్మ పాల్గొన్నారు.
GNTR: మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్ష కోసం జిల్లాలో 20 కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. గుంటూరు, తెనాలి, మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లో ఈ కేంద్రాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) డైరెక్టర్ జనరల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్, పరీక్ష నిర్వహణపై సమీక్షించారు.
GNTR: పొన్నూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో గురువారం అనుబంధ విభాగాల కమిటీ టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో డిజిటలైజేషన్ సమీక్ష సమావేశం జరిగింది. సుధాకర్ బాబు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి, రాబోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సభ్యులకు సముచిత స్థానం కల్పిస్తారని తెలిపారు.
AKP: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 28న రాంబిల్లి మండలం సీతపాలెంలో పర్యటిస్తున్న నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను సీఐ నర్సింగరావు ఆధ్వర్యంలో పోలీసులు పరిశీలించారు. పార్కింగ్ ప్రాంతం, భద్రత ట్రాఫిక్ తదితర విషయాలపై చర్చించారు. బ్లూ జెట్ కంపెనీ ప్రారంభోత్సవానికి లోకేష్ ముఖ్యఅతిథిగా వస్తున్న విషయం తెలిసిందే.తగిన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
పల్నాడు జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయాల్లో 5 నుంచి 8వ తరగతి , ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కన్వీనర్ పరమేశ్వరరావు గురువారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 4 నుంచి మార్చి 3 వరకు https://mjpapbcwreis.apcfss.in/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
NDL: ఆత్మకూరులో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. గురువారం ఆత్మకూరు పట్టణ కేంద్రంగా సాగుతున్న నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని గుర్తించి, భారీగా కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన భయంకరమైన నిజాలు స్థానికులను విస్తుపోయేలా చేశాయి.
CTR: సంజీవని ప్రాజెక్ట్ సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో నాల్గవ సమావేశం నిర్వహించి, డిజిటల్ నర్స్ సెంటర్ మరియు “సంజీవిని” ప్రాజెక్ట్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సంజీవినిసేవలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
NDL: కొలిమిగుండ్ల(మం) అబ్దుల్లాపురంలో ఇవాళ జూటూరు పుష్పావతి అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి గురమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.
NTR: కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా నుంచి విద్యార్థులు, యువతతో కలిసి డ్రగ్స్పై అవగాహన సైకిల్ ర్యాలీ యాత్ర పోలీస్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పోలీస్ కమిషనర్ ఎస్ వి. రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, ప్రజలు, డ్రగ్సకి దూరంగా ఉండాలన్నారు. ఈ ర్యాలీలో భారీ ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.
ELR: బాల్య వివాహాలను అరికట్టాలని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ సూచించారు. గురువారం బాల్య వివాహ విముక్తి రథాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని అన్నారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారికి వివాహం చేయడం సమంజసం కాదని అన్నారు. మనమందరం కలిసికట్టుగా బాల్య వివాహ మూలాలను నిర్మూలించాలని చెప్పుకొచ్చారు.
W.G. ఆచంటలో గురువారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. కచేరి సెంటర్, ఎంవీఆర్ కళాశాల రహదారి, ముత్యాలమ్మ గుడి ప్రాంతాల్లో ఐదుగురు విద్యార్థులతో సహా సుమారు 15 మందిపై దాడి చేసింది. కుక్కకాటుకు గురైన వారంతా PHCలో చికిత్స పొందుతున్నారు. వీధుల్లో కుక్కల బెడద పెరిగిపోవడంతో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
KRNL: ఆదోనిలో కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో వైసీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఇవాళ మైనార్టీ కాలనీ, నిజాముద్దీన్ కాలనీ ప్రాంతాల అభివృద్ధి పనుల ఆలస్యాన్ని ప్రస్తావించారు. రూ.21.60 లక్షల పనులు భూమిపూజ చేసినప్పటికీ ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
PLD: అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సీఎం చంద్రబాబుతో ముచ్చటించారు. నియోజకవర్గ సమస్యలపై సీఎం చంద్రబాబుకు వివరించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వంద రోజులు 100 గ్రామాలు కార్యక్రమం గురించి తెలిపారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన మేర పరిష్కరిస్తున్నామన్నారు. నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని భాష్యం కోరారు.
CTR: త్వరలో ఐటీఐ కళాశాలకు కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం విజయ పురంమండలంలో ప్రధాన కేంద్రంలో ఉన్న ఐటీఐ కళాశాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఐటీఐలో ఎలక్ట్రికల్, పిట్టర్, ఆటోమొబైల్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్ వివిధ సెక్షన్లను పరిశీలించారు.
VZM: మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్తో వీసీలో పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్, అయ్యప్పనగర్లోని ఏపీ మోడల్ స్కూల్, JNTU బ్లాక్ 1, 2 , ప్రభుత్వ బాలికల హై స్కూల్లలో నిర్వహించడం జరుగుతుందన్నారు.