• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

2027 జనాభా గణన నిర్వహణకు 3 రోజుల శిక్షణ: జేసీ

E.G: జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణకు సంబంధించి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జేసీ వై.మేఘస్వరూప్ తెలిపారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో జేసీ మాట్లాడారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1వ తేదీ వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో శిక్షణ జరగనుందన్నారు.

February 26, 2026 / 03:32 PM IST

జీసీసీలో సిబ్బంది కొరతపై మంత్రికి వినతి

ASR: అమరావతిలో GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిను కలిసి సంస్థలో సిబ్బంది కొరత, పరిపాలనా సమస్యలపై ఇవాళ వినతిపత్రం సమర్పించారు. మార్కెటింగ్, ట్రాన్స్‌పోర్ట్, ఇంజినీరింగ్, ఫైనాన్స్ విభాగాల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. గిరిజన రైతుల నుంచి కాఫీ కొనుగోలుకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు.

February 26, 2026 / 03:28 PM IST

పాల కేంద్రాల్లో అధికారుల దాడులు

W.G: తణుకులోని పాల కేంద్రాలతోపాటు డైరీ ఫార్మ్స్‌పై గురువారం అధికారులు దాడులు నిర్వహించారు. ఇటీవల రాజమహేంద్రవరంలో కల్తీ పాలు కారణంగా ఆరుగురు మృతి చెందటంతో జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీధర్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్, తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తనిఖీలు చేసి నమూనాలు సేకరించారు.

February 26, 2026 / 03:24 PM IST

‘శారదా నది గుట్లును పటిష్టం చేయాలి’

AKP: వరదలు వస్తే పంట పొలాలకు నష్టం కలగకుండా రాంబిల్లి మండలంలో శారదా నది గుట్లును పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ విజ్ఞప్తి చేశారు. గురువారం శాసనసభలో మాట్లాడుతూ.. అల్లూరి జిల్లా, ఒడిస్సాలో ఎక్కడ వర్షం పడినా శారదా నది ఉధృతంగా ప్రవహిస్తూ రాంబిల్లి సముద్రంలో కలుసుకుందన్నారు. దీనివల్ల వరద ముప్పు ఏర్పడుతుందన్నారు.

February 26, 2026 / 03:22 PM IST

YCPలోనే ఆదాల.. పార్టీ మార్పు లేనట్లే!

నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. వైసీపీని వీడి బీజేపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇవాళ నెల్లూరుకు వచ్చిన జగన్‌ను ఆదాల కలిశారు.

February 26, 2026 / 03:21 PM IST

సీఎం హామీతో ఇల్లు నిర్మాణానికి అధికారులు కృషి

E.G: తాళ్ళపూడి మండలం మలకపల్లిలో నిర్వహించిన ప్రజావేదికలో గ్రామానికి చెందిన సనమండ్ర పోసియ్యకు చెందిన గృహాన్ని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు లబ్ధిదారుడి గృహాన్ని హౌసింగ్ డిపార్ట్‌మెంట్, MRO గురువారం పరిశీలించారు. లబ్దిదారుడికి హౌసింగ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

February 26, 2026 / 03:18 PM IST

దసరా నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

ATP: రాయదుర్గంలో అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని MLA కాలవ శ్రీనివాసులు కోరారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. రూ.64.81 కోట్లతో చేపట్టిన ఈ గృహ సముదాయాల్లో ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన నిధులు కేటాయిస్తే 1008 పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుందన్నారు.

February 26, 2026 / 03:17 PM IST

ఈదురు గాలులకు నేలకొరిగిన పంట

VZM: గజపతినగరం మండలంలో ఈదురుగాలులకు 150 ఎకరాలు మొక్కజొన్న పంట నేలకొరిగిందని సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మల జ్యోతి చెప్పారు. నేలకొరిగిన మొక్కజొన్న పంటను పలు గ్రామాల్లో ఏడిఏ నిర్మల జ్యోతితో పాటు మండల వ్యవసాయ అధికారి ఏ కిరణ్ కుమార్ పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

February 26, 2026 / 03:17 PM IST

ప్రశాంతంగా ముగిసిన ఇంగ్లీష్ పరీక్ష..!

CTR: పాలసముద్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపల్ డా. ఏ.హేమలత తెలిపారు. ప్రభుత్వ జూ.కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 100 మందికి 100 మంది హాజరయ్యారన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 03:15 PM IST

రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ బదిలీ

కోనసీమ: రామచంద్రపురం డీఎస్పీ బి. రఘువీర్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది డీఎస్పీలను మంగళగిరి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన బదిలీ అయ్యారు. డివిజన్ పరిధిలో ఉత్తమ పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ద్రాక్షారామ కార్తీక మాస ఉత్సవాలలో అందరి మన్ననలు పొందారు.

February 26, 2026 / 03:05 PM IST

103వ రోజు చేరుకున్న నిరాహార దీక్ష

KRNL: ఆదోని జిల్లాలో సాధన నిరాహార దీక్షలు గురువారనికి 103వ రోజుకు చేరాయి. జేఏసీ నేతలు హనుమంతు, సుభాష్ చంద్రబోస్, నాగరాజు తదితరులు దీక్షలో ఉన్నారు. కొందరు నేతలు దీక్ష విరమిస్తారని ప్రకటించినప్పటికీ, మరో వర్గం దీక్ష కొనసాగించింది. ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని, జిల్లా సాధించే వరకు పోరాటం ఆపరాదుని జేఏసీ నేతలు వెల్లడించారు.

February 26, 2026 / 03:01 PM IST

రైల్వే కోడూరులో మార్చి 5న జాబ్ మేళా

TPT: రైల్వే కోడూరులో మార్చి 5న శ్రీ సాయి డిగ్రీ & పీజీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 15 కంపెనీలు పాల్గొని 630 కిపైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావచ్చు. ఆసక్త కలిగి అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

February 26, 2026 / 02:59 PM IST

జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యం: మేడిశెట్టి

కాకినాడ: ఏలేశ్వరంలో జనసేన నాయకుడు బంక కోదండరాం ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. రాష్ట్ర కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వం వల్ల లభించే బీమా, ఇతర ప్రయోజనాలను కార్యకర్తలకు వివరించారు. పార్టీ శ్రేణులు తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆశయాలను బలోపేతం చేయాలన్నారు

February 26, 2026 / 02:59 PM IST

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం చీరాలలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును ప్రతి గదికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ప్రశ్నాపత్రం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా, కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

February 26, 2026 / 02:56 PM IST

‘నీటి పిల్లుల సంరక్షణ అందరూ సహకరించాలి’

కాకినాడ: కోరంగి అభయారణ్యంలో పర్యావరణ పరిరక్షణకు కీలకమైన నీటి పిల్లులను కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజర్ ఎస్.ఎస్.ఆర్. వరప్రసాద్ కోరారు. వీటిని వేటాడితే వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ అరుదైన జీవుల సంతతిని పెంచేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు.

February 26, 2026 / 02:55 PM IST