• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నాగమల్లకుంట గ్రామంలో తాగునీటి సమస్య

NDL: బేతంచర్ల మండలంలోని నాగమల్లకుంట గ్రామంలో పైపులైన్ పగిలిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పది రోజులుగా పైపులైన్ మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామస్తులు తాగునీటి కోసం పంట పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పగిలిన పైపులైన్ ద్వారా నీరు వృథాగా పోతుండటంతో నీటి ఎద్దడి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 2, 2026 / 09:24 AM IST

కుశాల్ దాస్‌గుప్తకు “ప్రైడ్ ఆఫ్ కర్ణాటక” అవార్డు ప్రదానం

SS: పుట్టపర్తికి చెందిన కుశాల్ దాస్‌గుప్తకు ప్రతిష్టాత్మకమైన “ప్రైడ్ ఆఫ్ కర్ణాటక – మహాదేవపుర రత్న అవార్డు 2026” లభించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి అరవింద్ లింబావళి చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. సామాజిక సేవ, ఫిల్మ్ మేకింగ్, వినూత్న విజువల్ డిజైన్ రంగాల్లో చేసిన కృషికి గాను ఈ అవార్డు దక్కింది.

March 2, 2026 / 09:24 AM IST

తెనాలిలో ‘కార్డెన్ సెర్చ్ నిర్వహణ

GNTR: తెనాలి త్రీ టౌన్ పీఎస్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ జనార్ధనరావు పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, సిబ్బంది 5 గంటల నుంచే కాలనీని చుట్టుముట్టి ప్రతి ఇంటిని సోదా చేశారు. అనుమానిత వ్యక్తులను విచారించి వారి వివరాలను సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.

March 2, 2026 / 09:16 AM IST

‘ఇళ్ల మధ్యలో డంపు చేసిన చెత్తను తరలించాలి’

ATP: గుంతకల్లు పట్టణంలోని తిలక్ నగర్ ఏరియాలో సోమవారం చేస్తున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. కాలనీవాసులు కాళీ ప్రదేశంలో చెత్తను డంపు చేశారని కమిషనర్‌‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే కమీషనర్ చెత్తను తరలించాలని సిబ్బందికి ఆదేశించారు. డ్రైనేజీ కాలువలపై సేఫ్టీ గా బండలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కమిషనర్‌కు సూచించారు.

March 2, 2026 / 09:08 AM IST

‘గ్రామంలో తాగునీటి సమస్య.. వెంటనే పరిష్కరించాలి’

NDL: నాగమల్లకుంట గ్రామంలో పైపులైన్ పగిలిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పది రోజులుగా మరమ్మతులు చేయకపోవడంతో గ్రామస్థులు తాగునీటి కోసం పంట పొలాలకు వెళ్లాల్సి వస్తోంది. పగిలిన పైపులైన్ ద్వారా నీరు వృథాగా పోతుండటంతో ఎద్దడి ఏర్పడిందని ఇవాళ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలనిన్నారు.

March 2, 2026 / 09:05 AM IST

‘ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి’

E.G: APSRTC ఎంప్లాయిస్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జీ. చిరంజీవి విజయవాడ జోనల్ అధ్యక్షుడిగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా RJY డిపో ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి, మెమోంటో అందజేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు కోరారు.

March 2, 2026 / 09:04 AM IST

నేటి నుంచి ఓపెన్ పరీక్షలు

నెల్లూరు జిల్లాలో నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు డీఈవో ఆర్. బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు, 10వ తరగతి విద్యార్థులకు 16 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్‌కు 12, 10వ తరగతికి 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

March 2, 2026 / 09:04 AM IST

ఆలయంలో ప్రదోష కాల అభిషేకాలు.. నేడు గిరి ప్రదక్షిణ

కృష్ణా: యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశి సందర్భంగా ప్రదోష కాల అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహానందీశ్వర స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

March 2, 2026 / 09:03 AM IST

‘బాణసంచా తయారీ కేంద్రాలపై నిఘా పెట్టండి’

KKD: పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని బాణాసంచా తయారీ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంచాలని కాకినాడ MP తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశించారు. ఆదివారం తహసీల్దార్లు, పోలీస్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు.

March 2, 2026 / 09:02 AM IST

ఎర్రగొండపాలెం నూతన ఎస్సైగా దేవకుమార్

ప్రకాశం: ఎర్రగొండపాలెం మండల పోలీస్ స్టేషన్ నూతన SIగా దేవకుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన SI చౌడయ్య జిల్లా VRకు బదిలీ కావడంతో ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు దేవకుమార్ను ఇక్కడకు నియమించారు. బాధ్యతలు చేపట్టిన నూతన SIకి స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై పేర్కొన్నారు.

March 2, 2026 / 08:56 AM IST

నేటి నుంచి ముఖ ఆధారిత హాజరు

AKP: ఉపాధి హామీ పథకం వేతనదారులకు సోమవారం నుంచి ముఖ ఆధారిత హాజరు అమలులోకి వచ్చింది. ఎస్ రాయవరం మండలం దార్లపూడిలో వేతనదారులకు ముఖ ఆధారిత హాజరు నమోదు చేశారు. మండలంలో పలు గ్రామాల్లో పనిచేస్తున్న 2,200 మందికి ముఖ ఆధారిత హాజరు వేసినట్లు ఏపీఓ ఎరకయ్య తెలిపారు. బినామీ మస్తర్లలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిందన్నారు.

March 2, 2026 / 08:47 AM IST

జామి యల్లారమ్మ పండగలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: జామి యల్లారమ్మ పండగలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరను అత్యంత వైభవంగా నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అభినందిస్తూ,వారి సేవలను కొనియాడారు. అనంతరం అమ్మవారి ఆలయం ప్రాంగణంలో సుమారు 10 వేల మంది భక్తులకోసం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని వడ్డించారు.

March 2, 2026 / 08:47 AM IST

మహిళా భద్రతపై అవగాహన ర్యాలీ

GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం గుంటూరు ఈస్ట్ సబ్-డివిజన్ పరిధిలో మహిళా భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడం అందరి బాధ్యతని, అన్యాయం జరిగితే ధైర్యంగా స్పందించి పోలీసుల ‘శక్తి టీమ్’ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

March 2, 2026 / 08:46 AM IST

కొండూరులో నేరాలపై గ్రామసభ

SS: జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాలతో, డీఎస్పీ కేవీ మహేష్ పర్యవేక్షణలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ నేతృత్వంలో లేపాక్షి పరిధి కొండూరు గ్రామంలో ఎస్సై. నరేంద్ర, సిబ్బందితో గ్రామసభ నిర్వహించారు. ఆస్తి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, అనుమానాస్పద కార్యకలాపాలపై అవగాహన కల్పించారు.

March 2, 2026 / 08:45 AM IST

పొదిలిలో విస్తృతంగా వాహన తనిఖీలు

ప్రకాశం: పొదిలిలోని పలు ప్రాంతాల్లో SI రాజేశ్ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ముఖ్య డ్రైవ్ చేపట్టి వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ వినియోగంపై ఆరా తీశారు. ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు.

March 2, 2026 / 08:44 AM IST