మార్కాపురం జిల్లా మండలంలోని చిన్న కంభం సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏ. ఈ వెంకట నరసయ్య తెలిపారు. చిన్న కంభం, దేవనగరం, గోవిందాపురం, దర్గా మరియు గచ్చు కాలువ ఫీడర్ పరిధిలోనిఅంతరాయం ఏర్పడుతుంది. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
AKP: మునగపాక ఆలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి, విశాలాక్షి కళ్యాణ మహోత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ఆలయం ఆవరణలో అదిష్టింప చేసి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణ మహోత్సవంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. కళ్యాణాన్ని తిలకించిన భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు.
NTR: విజయవాడ కార్పొరేషన్లో పన్నులు చెల్లించాలన్నా లంచాలు సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఖాళీ స్థలం, ఇంటి మ్యుటేషన్ పన్నుల కోసం వచ్చే వారిని RIలు వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డాక్యుమెంట్లు సరిగ్గా లేవని వంకలు పెడుతూ, VROలను కలిసి ‘రేటు’ మాట్లాడుకోవాలని పంపిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఫైలుకు రూ. 15వేల-రూ.25వేలు వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
PLD: నకరికల్లు మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈఈ సుచరిత తెలిపారు. సబ్ స్టేషన్లో కొత్త బ్రేకర్ ఏర్పాటు చేసే పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. సుమారు 6 గంటల పాటు కరెంట్ కోత ఉంటుందని, గ్రామ ప్రజలు గమనించి శాఖకు సహకరించాలని ఆమె కోరారు.
కోనసీమ: అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామంలో ఆదివారం శెట్టిబలిజ స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించనున్నట్లు సంఘ పెద్దలు మట్టపర్తి మీరా సాహెబ్ శెట్టి తెలిపారు. శుక్రవారం రాత్రి గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలంగాణ సంఘం అధ్యక్షులు గుత్తుల మీరా కుమార్ పాల్గొంటారని తెలిపారు.
NLR: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్గా రవి జోసెఫ్ నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ATP: మిర్చి పంట దొంగతనాలను అరికట్టేందుకు విడపనకల్లు మండల పోలీసులు గ్రామసభల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. CI మహనంది, ఎస్సై ఖాజా మొహిద్దీన్ పొలాల్లో పర్యటించి భద్రతా చర్యలు సూచించారు. పంట రాశుల వద్ద రాత్రిపూట కనీసం ఇద్దరు వ్యక్తులు కాపలా ఉండాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100, 112కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
GNTR: కొల్లిపర మండలం తూములూరు అడ్డరోడ్డు సెంటర్లో శుక్రవారం రాత్రి పేకాడుతున్న ఏడుగురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి నిందితుల వద్ద నుంచి రూ. 4,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోనసీమ: ఐ. పోలవరం మండలం మురముళ్ళ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అమలాపురం ఏఈ రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఐ.పోలవరం, తిలకుప్ప, కొమరిగిరి, కేసనకుర్రు, టి.కొత్తపల్లి, జి.వేమవరం గ్రామాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది అని తెలిపారు.
సత్యసాయి: భారత జనగణన–2027 నిర్వహణపై శుక్రవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్ సమీక్ష నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఈ సమావేశానికి హాజరై జిల్లాలోని సన్నద్ధతపై వివరాలు సమర్పించారు. ఎన్యూమరేటర్ల అవసరాల అంచనా, మాస్టర్ ట్రైనర్ల ఎంపిక, అధికారులకు శిక్షణ ఏర్పాట్లు వంటి కీలక అంశాలపై చర్చించారు.
ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో శుక్రవారం పది మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. హిందూపురం బాలయేసు కళాశాలలో ఒకరు, బాలాజీ విద్యామందిర్లో ముగ్గురు, కళ్యాణదుర్గం జ్యోతిర్మయి కళాశాలలో ఐదుగురు, అనంతపురం చైతన్య కళాశాలలో ఒకరిపై చర్యలు తీసుకున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ ఆచార్య రమణ తెలిపారు.
అనకాపల్లి పట్టణం గవరపాలెంలో వేంచేసియున్న నూకాంబిక అమ్మవారికి విశాఖ నగరం చిన్న వాల్తేరుకు చెందిన పల్లా వెంకట చంద్రశేఖర్ శుక్రవారం 40 గ్రాముల బరువు గల రెండు బంగారు మంగళసూత్రాలు వితరణగా అందజేశారు. వీటిని అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ ఛైర్మన్ పీలా నాగ శ్రీను, ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి వై.శ్రీధర్కు వాటిని అందజేశారు.
TPT: కొత్తపేటలోని ద్వారకానగర్లో ఆదివారం నిర్వహించనున్న జల్లీ కట్టు కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారికి ఇరువైపులా ఇసుక బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతకు నిర్భాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
కోనసీమ: సఖినేటిపల్లి ( M ) అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో రంగుల రబ్బర్ ఫిష్ జాలరికి చిక్కి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇది సుమారు ఒక కేజీ ఉన్నట్లు జాలర్లు తెలిపారు. ఈ రబ్బర ఫిష్ మొదటిసారిగా హర్బర్కు రావడం వల్ల అక్కడ ప్రజలంతా దాన్ని వింతగా చూశారు .
అల్లూరి: పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయని వివరించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.