దేశ ఆర్థిక వ్యవస్థ వేగవంత వృద్ధిని నమోదు చేస్తోందని RBI తెలిపింది. ‘ఆర్థిక స్థిరత్వంపై విడుదల చేసిన అర్థ సంవత్సర నివేదిక’లో RBI పేర్కొంది. బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి మున్ముందు మరింత మెరుగవుతుందని వెల్లడించింది. 2025 సెప్టెంబరు చివరికి 46 బ్యాంకుల GNPA నిష్పత్తి దశాబ్దాల కనిష్ఠమైన 2.1శాతంగా ఉందని, 2027మార్చికి ఇది 1.9శాతానికి తగ్గుతుందని పేర్కొంది.