MHBD: పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అన్నారు. గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల పోడు భూములకు గిరిజన, గిరిజనేతర రైతులకు ఇప్పటికీ హక్కు పత్రాలు అందలేదని వేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. హక్కు పత్రాలు ఇవ్వకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.