మహా శివరాత్రి (Maha Shivaratri)ని పురస్కరించుకుని ఈసారి మంగ్లీ ఏకంగా మూడు పాటలను విడుదల చేసింది. అది కూడా పాన్ ఇండియా మాదిరి తెలుగుతోపాటు హిందీ, కన్నడ భాషల్లో పాటను రూపొందించారు. భక్తి తన్మయత్వంతో కూడిన ఈ పాటలను భక్తులను మైమరపిస్తున్నాయి. భక్తి తన్మయత్వంతో కూడిన ఈ పాటలు భక్తులను మైమరపిస్తున్నాయి.
Harish Rao : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ వచ్చి తెలంగాణపై విషం గక్కే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా మాట్లాడారని, ఆమె మాటల్లో నిజాయితీ లేదు, నిజం లేదని హరీశ్ రావు అన్నారు. నిర్మలా సీతారామన్ చెప్పిన దాంట్లో కొత్తగా ఏమీ లేదని, అన్నీ అబద్దపు మాటలేనని హరీశ్ రావు తేల్చిపారేశారు.
శివరాత్రి, జగ్ నే కీ రాత్ కి ఆయా వర్గాలు జాగరణ చేస్తారు. భగవన్నామస్మరణలో మునిగి ఉంటారు. ఈ సందర్భంలో కొందరు ఊరేగింపులు చేసే అవకాశం ఉంది. అయితే అత్యంత వేగంగా ఫ్లై ఓవర్లపై నుంచి కొనసాగితే ప్రమాదాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నారు. కాగా ఆదివారం తెల్లవారుజాము తర్వాత తిరిగి ఫ్లై ఓవర్లు తెరచుకుంటాయి.
రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం రాత్రి 10 గంటల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో గుండెపోటుకు గురయ్యారు.
‘కితకితలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన గీతా సింగ్ కు అసలు వివాహం కాలేదు. కానీ ఆమె తన అన్న కుమారులను పెంచి పోషిస్తోంది. ఆమె అన్నయ్య అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయన ఇద్దరు కుమారుల బాధ్యతను గీతా సింగ్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ ఇద్దరితో పాటు తన చుట్టాలమ్మాయిని కూడా పెంచుతోంది. అందరి ఆలనాపాలనా ఆమె చూసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలలో ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాశీ విశ్వనాథ్, సోమ్ నాథ్, కాళేశ్వరం, వేములవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి మహాప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలు భక్తులు చేశారు.
Somu Verraju : కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ ని వీడిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ వీడి వెళ్తూ వెళ్తూ సోము వీర్రాజు పై తీవ్ర విమర్శలు చేశారు. సోము వీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడినట్లు ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. కాగా... తాజాగా.. కన్నా తనపై చేసిన కామెంట్స్ పై సోము వీర్రాజు స్పందించారు.
వరుస భూకంపాలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పది రోజుల క్రితం టర్కీ, సిరియా(Turkey, Syria)లో భూకంపం సంభవించింది. వేలాది మంది మృతి చెందారు. ఆ సంఘటన నుంచి కోలుకోని సిరియా(Syria)లో మళ్లీ భూకంపం సంభవించింది.
KTR : అందరికీ ఒకే అబద్దం నేర్పించాలని... ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని కేంద్రంలోని అధికార పార్టీపై మంత్రి కేటీఆర్ చురకలు వేశారు. తెలంగాణకు వైద్య కళాశాలల మంజూరు విషయంలో కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మంత్రులు చెప్పేవన్నీ అబద్దాలని.. కనీసం అబద్ధాలనైనా అందరూ ఒకేలా చెప్పాలని, దాని కోసం కేంద్ర మంత్రులకు సరైన శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోడీకి సూచించారు.
ఇండియన్ క్రికెటర్ పృథ్వీ షాపై ఇటీవల దాడి జరిగిన ఘటనలో భోజ్పురి నటి సప్నా గిల్ అరెస్టయ్యారు. పృథ్వీ షాతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమెను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీక్రెట్ బాక్సులో రాగి కంకులు పైన పెట్టి కింద గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 23 కిలోలలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ కొండాపూర్ పరిధిలో చోటుచేసుకుంది.
Sharmila Padayatra : వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంటోంది. మరికొన్ని రోజుల్లో షర్మిల పాదయాత్ర ముగియనుంది. మార్చి 5న పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో ముగింపు సభను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
లేఆఫ్ల బాటలో తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ కూడా చేరింది. ఈ క్రమంలో దేశంలోని గూగుల్ సంస్థలో పనిచేస్తున్న 453 మందిని గురువారం అర్థరాత్రి నుంచి తొలగించినట్లు తెలిసింది. తొలగించబడిన Google ఉద్యోగులకు అధికారిక మెయిల్లో CEO సుందర్ పిచాయ్ నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ (Twitter)ను సొంతం చేసుకున్నప్పటి నుండి ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు, అప్పుడప్పుడు వివాదాస్పద ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్ ను సొంతం చేసుకోవడానికి ముందు కూడా నాటి యాజమాన్యంతో వివాదానికి తెర లేపాడు.