నటుడు మంచు మనోజ్(Manchu Manoj) తమకు విలువైన గిఫ్ట్ పంపించినందుకు స్టార్ హీరో రామ్ చరణ్(ram charan), ఉపాసన(Upasana) దంపతులకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఆయన పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా గిఫ్ట్ ఫొటోలను పంచుకున్నాడు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) కపుల్ పేరెంట్స్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ముంబై ఖార్లోని సంతానోత్పత్తి క్లినిక్ వెలుపల వరుణ్ తన భార్యతో కనిపించిన నేపథ్యంలో వీరిద్దరు వారి మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతోపాటు కొంతమంది ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రధాని మోడీ కామెంట్లకు మంత్రి కేటీఆర్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. అభివృద్ది పనుల సాకు చూపి.. రాజకీయాల కోసమే మోడీ హైదరాబాద్ వచ్చారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
స్టార్ హీరో విక్రమ్(Vikram) పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 17న తన తాజా చిత్రం తంగళన్(Thangalaan) నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు పా రంజిత్(Pa Ranjith) దర్శకత్వం వహిస్తుండగా..జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
ప్రముఖ నటి నయనతార(Nayanthara) 75వ చిత్రం షూటింగ్ మొదలైంది. అయితే గ్రేట్ డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నీలేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మేరకు షూటింగ్ స్పాట్ నుంచి నీలేష్ కృష్ణ ఓ వీడియోను పంచుకున్నారు.
ఫేమస్ అమెరికన్ సింగర్ టేలర్ అలిసన్ స్విఫ్ట్(taylor swift) తన ప్రియుడి(joe alwyn)తో ఆరేళ్ల తర్వాత విడిపోయింది. ఈ మేరకు స్విఫ్ట్ తన ఇన్ స్టాలో పేర్కొంటూ వెల్లడించింది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) శనివారం అస్సాం(Assam)లోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్(Tezpur Air Force Station) నుంచి సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్ నుంచి 30 నిమిషాల విమానంలో ప్రయాణించారు. రాష్ట్రపతి ఫ్లయింగ్ సూట్లో కనిపించారు.
విద్యుత్ మీటర్ల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) 13 నుంచి 14 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రాం(tdp leader Pattabhi Ram) ఆరోపించారు. ఆ క్రమంలో మీటర్ల కాంట్రాక్టులు మొత్తం బినామీలకే ఇచ్చుకున్నట్లు గుర్తు చేశారు.
మాస్ మహారాజా రవితేజ నటించి, నిర్మించిన చిత్రం రావణాసుర(ravanasura). ఈ చిత్రం దేశ వ్యాప్తంగా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 5 కోట్లు రాబట్టింది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా, శ్రీకాంత్ విసా కథను అందించారు.
ప్రముఖ దర్శకుడు రవిబాబు, నటి పూర్ణ నటించిన 'అసలు' మూవీ ట్రైలర్(asalu movie trailer) విడుదలైంది. ఓ ప్రొఫేసర్ ను ఎందుకు చంపావ్ అనే డైలాగ్ తో కొనసాగుతున్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM MODI) విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది అభివృద్ధి పనులకు భయపడుతున్నారని...వారికి దేశ, సమాజ సంక్షేమంతో సంబంధం లేదని ఎద్దేవా చేశారు. కానీ వారికి తమ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటారని గుర్తు చేశారు. అలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు.
తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఈ సభలోనైనా నిధులు ప్రకటించాలని కోరుతున్నాం. మీ రాజకీయ స్వార్థం కోసం ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరం.