నేను కూడా ముసలోడిని అవుతున్నా. 69 ఏళ్లు వచ్చాయి. నా కన్నా వయసులో పెద్దవాడైనా.. నేను ఉన్నన్ని రోజులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ప్రజలకు సేవ చేస్తాడు. ఆయన్ను వదిలిపెట్టేది లేదు. ఆయన మాటే బ్రహ్మాస్త్రం.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొత్త చిత్రం సెక్షన్ 84. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ బిగ్ బీ ప్రకటించారు. ఈ చిత్రానికి యుధ్, Te3nకి దర్శకత్వం వహించిన రిభు దాస్గుప్తా డైరెక్షన్ చేస్తున్నారు.
వరంగల్(Warangal) కేఎంసీ(KMC) మెడికల్ విద్యార్థిని ప్రీతి(Preethi)ని సైఫ్(saif) మానసికంగా వేధించాడని కాకతీయ మెడికల్ కాలేజీ(kakatiya medical college)లో సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ(anti ragging committee) బుధవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆ నివేదికను ఢిల్లీలోని యూజీసీతోపాటు ఎన్ఎంసీకి కూడా అందజేస్తామని కేఎంసీ ప్రిన్సిపల్ మెహన్ దాస్ వెల్లడించారు. ఆ తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలో రేపటి నుంచి వారం పాటు 144 సెక్షన్(144 Section) అమల్లో ఉంటుందని అక్కడి జిల్లా ఎస్పీ జె.సురేందర్ రెడ్డి(sp surender reddy) ప్రకటించారు. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు సహా ప్రజలు కూడా సమన్వయం పాటించాలని కోరారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మంగళవారం రేవంత్ రెడ్డి సభ జరిగిన క్రమంలో పలువురు...
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మేరకు మేకర్స్ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరోయిన్ అనుష్క, హీరో నవీన్ పోలిశెట్టి క్రేజీగా కనిపిస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంలో అభిమానుల్లో మరింత ఆసక్తి మొదలైంది.
ఇటీవల నార్సింగి శ్రీచైతన్య కాలేజీ(sri chaitanya junior college)లో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్(Satvik) సూసైడ్ లెటర్లో(Suicide letter) సంచలన విషయాలను వెల్లడించాడు. అయితే తన మృతికి కారణం కాలేజీలో ప్రిన్సిపల్, ఇంచార్జీ, లెక్చరేనని వెల్లడించాడు. వీరి టార్చర్ వల్లనే తాను సూసైడ్ చేసుకున్నట్లు సాత్విక్ తెలిపాడు. అంతేకాదు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో వెల్లడించాడు.
Renuka Chowdary : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. దివంగత రాజశేఖర్ రెడ్డికి ఈ సంతానం మూలంగా సుఖం లేకుండా పోయింది అని ఆమె అన్నారు. ఆయన ఆత్మకు ఆత్మశాంతి లేకుండా జగన్ పిచ్చి వేషాలు వేస్తున్నారని అన్నారు.
గతంలో జరిగిన జూబ్లీహిల్స్ ఘటన నుంచి ఇటీవల చోటుచేసుకున్న ప్రీతి ఘటన వరకు ఏ ఒక్క దాని విషయంలో కూడా కేసీఆర్ సమీక్ష చేయలేదని బండి సంజయ్ విమర్శించారు. బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో భాగంగా వెల్లడించారు. మరోవైపు తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై.. యూపీలో మాదిరిగా బుల్ డోజర్లతో వారి ఇళ్లను కూల్చివేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ జీడిమెట్ల(Jeedimetla) ప్రాంతంలోని ఆరోరా ఫార్మా ప్రైవేటు కంపెనీ(arora pharmaceuticals pvt Company)లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కేఎంసీ మెడికల్ విద్యార్థిని ప్రీతి మృతి కేసులో పోలీసుల అదుపులో ఉన్న సైఫ్ రిమాండ్ లో భాగంగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. రెండు కారణాల నేపథ్యంలో అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న సూపర్ వైజర్ సైఫ్..ప్రీతిపై కోపం పెంచుకున్నట్లు తెలిసింది. ఓ యాక్సిడెంట్ రిపోర్టు సహా తనపై హెచ్ఓడీకి ఫిర్యాదు చేసినందుకు సైఫ్ ఆమెపై కోపంతో ఉన్నాడని రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తోంది.
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.25 కోట్ల విలువైన 2.58 కిలోల కొకైన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన కేబినేట్ లో కీలక మార్పులు చేపట్టారు. ఇద్దరు కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇద్దరు ప్రస్తుతం జైల్లో ఉండడంతో అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. జైల్లో ఉన్న ఇద్దరి మంత్రుల రాజీనామాలు ఆమోదించిన తర్వాత ఇద్దరు కొత్త నాయకులకు మంత్రి పదవులు కట్టబెట్టారు. అతిషి, సౌరవ్ భర...
ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువవుతుంది. ఈ క్రమంలో గుండెకు మేలు చేసే ఆహారాలతోపాటు వ్యాయామం కూడా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే హార్ట్ కు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
Minister Kakani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ ఓ జోకర్ అని ఆయన పేర్కొనడం గమనార్హం. పవన్ గురించి మాట్లాడితే తమకే అవమానమని ఆయన అభిప్రాయపడ్డారు.
విరాట్ కోహ్లీ (Anushka Sharma) - అనుష్క శర్మ (Anushka Sharma) క్రేజీ కపుల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ తన భార్య తల్లిగా ఎంతో త్యాగం చేసిందని చెబుతూ ప్రశంసలు కురిపించాడు. అనుష్కను చూసి స్ఫూర్తి పొందుతానని చెప్పాడు.