• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

38కి చేరిన మృతుల సంఖ్య

బ్రెజిల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 38కి చేరింది. మినాస్ గెరియిస్ నగరంలో హైవేపై ట్రక్కును బస్సు ఢీకొట్టింది. రన్నింగ్‌లో ఉండగా బస్సు టైర్ ఊడిపోయింది. దీంతో అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. బస్సులో మంటలు చెలరేగటంతో 38 మంది మృతిచెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సావో పాలో ప్రాంతం నుంచి 45 మందితో బస్సు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

December 22, 2024 / 07:24 AM IST

చింతపల్లిలో నాటుసార తయారు.. నలుగురి అరెస్ట్

VSP: చింతపల్లి మండలంలోని లంబసింగి, కొయ్యూరు మండలం బంగారమ్మపేట, పరదేశిపాకలు గ్రామాల్లో నాటుసారాతో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని ఎక్సైజ్ సీఐ జే.కూర్మారావు శనివారం తెలిపారు. ముందస్తు సమాచారంతో తమ సిబ్బంది, టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్‌మెంట్ సిబ్బందితో కలిసి ఆయా గ్రామాల్లో దాడులు నిర్వహించగా, 114 లీటర్ల నాటుసారాతో నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారని తెలిపారు.

December 22, 2024 / 07:15 AM IST

తులసి మరిదే ప్రధాన సూత్రధారి..?

WG: ఉండి మండలం యండగండిలో పార్శిల్లో డెడ్బాడీ మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. తులసి మరిది సిద్ధార్ధ వర్మే ప్రధాన సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అతడు డెడ్ బాడీ వచ్చినప్పటి నుంచి కనిపించకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. డెడ్ బాడీ ఎవరిది, ఆ పార్శిల్ తెప్పించింది ఎవరు అనే విషయాలు తెలియాలంటే సిద్ధార్ధ వర్మ దొరకాలని ఎస్పీ నయిం పేర్కొన్నారు.

December 22, 2024 / 06:50 AM IST

కూతురు పెళ్లికి చేయించిన నగలతో తల్లి జంప్

కూతురు పెళ్లి కోసం చేయించిన నగలతో తల్లి పారిపోయిన ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఒరాయ్‌లోని కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత తన కూతురు పెళ్లికి చేయించిన రూ. 2.50 లక్షల విలువైన నగలు, రూ.40 వేలు తీసుకొని వేరే వ్యక్తితో పారిపోయింది. అయితే తన వద్ద నుంచి భర్త నగలు తీసుకొచ్చాడు. అనంతరం తన భార్యను తీసుకెళ్లిన వ్యక్తి ఆమెను అమ్మెస్తానని బెదిరిస్తున్నాడని ఎలాగైనా తన భార్యను కాపాడాలని పోలీసులను ఆశ్...

December 22, 2024 / 06:33 AM IST

ఆ ఇంట విషాదం వర్ణనాతీతం

JMV: పొలం పనులకు వెళ్ళిన అన్నదమ్ములు కరెంటు షాక్‌తో మృతి చెందిన JMV మండలం శికబడిలో చోటు చేసుకుంది. గ్రామానికి శ్రీనివాస రావు సింహాచలం శనివారం సాయంత్రం నీరు కట్టడానికి వెళ్లి వారివిగత జీవులయ్యారు. ముగ్గురు అన్నదమ్ముల్లో ఏడాది క్రితంపెద్దన్నయ్య పాము కాటుతో మృతిచెందారు. ఇప్పుడు ఇద్దరు మృతి చెందడంతో ఇంటికి మగదిక్కు లేరు అని కుటుంబసభ్యుల ఏడుస్తున్నారు.

December 22, 2024 / 06:30 AM IST

కోళ్ల వ్యర్ధాలు తరలిస్తున్న వాహనం సీజ్

W.G: పెదవేగి సీఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి శనివారం పెదపాడు మండలంలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు వాహన యజమాని, చెరువు యజమాని, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే చేపల చెరువుల్లో కోళ్ల వ్యర్ధాలను కలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

December 22, 2024 / 06:20 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

MNCL: మందమర్రి పట్టణంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు SI రాజశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి ఏరియాకు చెందిన సంతోశ్ రోడ్డు దాటుతున్న క్రమంలో బెల్లంపల్లి వైపు వెళ్తున్న బైకు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు కూడా తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు.

December 22, 2024 / 04:55 AM IST

ఘోర ప్రమాదం.. 22 మంది మృతి

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినాస్ గెరియిస్‌లో శనివారం తెల్లవారుజామున బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. సావో పాలో ప్రాంతం నుంచి 45 మందితో వెళ్తున్న బస్సు మినాస్ గెరియిస్‌ వద్దకు రాగానే టైరు పేలింది. ఈ క్రమంలో ట్రక్కును ఢీ కొట్టినట్లు అధికారులు తెలిపారు.

December 22, 2024 / 04:40 AM IST

ఆటోను ఢీకొన్న బైక్.. యువకుడు స్పాట్ డెడ్

NLR: నాయుడుపేట మండలం తిమ్మాజి కండ్రిగ గ్రామ సమీపంలో రహదారిపై శనివారం రాత్రి ఆటోను ఓ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మేనకూరు వైపు నుంచి బైక్‌లో వస్తున్న మనోజ్ కుమార్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నాడు. సీఐ బాబీ ఘటనకు వెళ్లి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 22, 2024 / 04:26 AM IST

పంది దాడి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

W.G: కొవ్వూరు పట్టణంలో శనివారం పంది కలకలం రేపడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలో ఒక వ్యక్తిని గాయపరిచిందని అదే విధంగా ఇందిరమ్మ కాలనీ అచ్చాయమ్మ కాలనీలో నలుగురిపై దాడి చేయగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

December 22, 2024 / 04:26 AM IST

తిరువూరులో భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం

NTR: తిరువూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ ఆధ్వర్యంలో శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏ. కొండూరు, తిరువూరు, గంపలగూడెం మండలాల్లో 57 తెలంగాణ మద్యం బాటిల్స్, 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు SI M. రామ శేషయ్య తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి తిరువూరు స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.

December 22, 2024 / 04:15 AM IST

బైకు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు

MNCL: మందమర్రి మండలం మేడారం గ్రామం మహా రెస్ట్రో ఎదురుగా శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద విషయాన్ని పోలీసులకు చేరవేసినట్లు గ్రామస్థులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 22, 2024 / 04:11 AM IST

సారా స్థావరాలపై దాడులు.. ఇద్దరిపై కేసులు నమోదు

ELR: టి. నర్సాపురం మండలంలోని వెలగపాడు, ఏపుగుంటలో పోలీసులు దాడులు చేశారు. ఘటనలో సారా కాస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ పేర్కొన్నారు. 600 లీట్లర్ బెల్లం ఊటను ధ్వంసం చేసి, 10 లీటర్ల స్వారాను స్వాధీనం చేసుకున్నామన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 22, 2024 / 04:02 AM IST

చింతాయపాలెంలో అగ్ని ప్రమాదం

BPT: కర్లపాలెం మండలం చింతాయపాలెంలో శనివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని నడింపాలెం రామాలయం సమీపంలో సాయంత్రం మంటలు వ్యాపించి పూరిపాక దగ్ధమైందన్నారు. వెంటనే స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికి ప్రయేజనం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

December 22, 2024 / 04:01 AM IST

“రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి”

NGKL: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై శనివారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచార మేరకు వేగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడని అక్కడికక్కడే మృతి చెందాడని వెల్లడించారు.

December 21, 2024 / 08:45 PM IST