KRNL: హోళగుంద మండలం వందవాగిలి గ్రామంలోని శ్రీరుక్మిణీ పాండురంగస్వామి ఆలయంలో శుక్రవారం చోరీ జరిగింది. దొంగలు ఆలయ తాళాలను పగలగొట్టి, రూ.35 వేలు విలువైన 5 గ్రాముల బంగారు తాళిబొట్లు, రూ.10 వేలు విలువైన రెండు కంచు గంటలను ఎత్తుకెళ్లారు. హుండీ తాళాలను పగలగొట్టడానికి ప్రయత్నించిన దొంగలపై పోలీసులు కేసు నమోదు చేశారు.