VKB: ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటన తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్గనూర్ గ్రామ సమీపంలో ఓ ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టడంతో పలువురి ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.