MNCL: బెల్లంపల్లి పట్టణంలో వన్ టౌన్ CI శ్రీనివాసరావు మంగళవారం రోడ్డు భద్రతపై వార్డ్ కమిటీ ఏర్పాటు, అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ACP రవికుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. వాహనాలు నడిపే ప్రతి డ్రైవరు లైసెన్స్తో పాటు సంబంధిత డాక్యుమెంట్లను కలిగి ఉండాలన్నారు.