SRD: కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ కాలనీలోని బస్తీ దవాఖానాకు 4 అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల మంగళవారం తెలిపారు. అత్యవసర సమయాల్లో సేవలు అందించేందుకు టెక్నీషియన్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు అంబులెన్స్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.