NZB: బోధన్లో ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించాలని ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు మల్లేశ్ కోరారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఈఎస్ఐ మేనేజర్ సురేందర్కు వినతి పత్రం అందించారు. అనంతరం మల్లేశ్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పనిచేసే 166 మందికి ఈఎస్ఐ కట్ అవుతుందన్నారు.