AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం భాష్యం స్కూల్లో దారుణం జరిగింది. ఐదవ తరగతి చదువుతున్న రంజిత అనే బాలిక చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీచర్ వేధింపులకు మనస్థాపానికి గురైందని కుటుంబ సభ్యులు ఆరోస్తున్నారు. విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.