W.G: అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం సీఎం సహాయనిధి రూపంలో అండగా నిలబడుతుందని ఆచంట ఎమ్మెల్యే పెతాని సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఆచంట నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన 45 మంది బాధితులకు రూ.17,69,739 నగదు విలువ గల చెక్కులను కొమ్ముచిక్కాల ఆఫీసు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.