KKD: కరప మండలంలోని గురజనాపల్లిలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎస్సై తోట సునీతకు ఆదివారం సమాచారం అందింది. దీంతో ఆమె ఇవాళ సాయంత్రం మెరుపు దాడి నిర్వహించారు. అక్కడ పేకాడుతున్న పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.14,574 నగదు, 104 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఆమె వివరించారు.