WGL: జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆదేశాల మేరకు శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని మేడపల్లి ZPSS హై స్కూల్లో విద్యార్థులకు స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాహసీల్దార్ ముప్పు కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. స్ఫూర్తి కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో తోడ్పడుతుందని అన్నారు.