NZB: ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి గ్రామ శివారు 44వ జాతీయ రహదారిపై ఆదివారం నారింజ పండ్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపైన వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.