విన్జు యాప్పై ఈడీ కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో యాప్ ప్రమోటర్లు పవన్ సింగ్, సౌమ్య రాథోడ్లను అరెస్ట్ చేసింది. వారికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసింది. గతవారం బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్లో సోదాలు చేసింది. విన్జు గేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన సుమారు రూ.505 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.