TPT: పాకాల మండలం దామలచెరువులో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పాకాల సీఐ సుదర్శన ప్రసాద్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం చెరువు మధ్యలో ఉండటంతో బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.