VSP: జోడిగుడ్లపాలెం నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన గరికిన నూకరాజు ప్రమాదవశాత్తు పడిపోవడంతో మృతి చెందాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఐదుగురితో కలిసి నూకరాజు శుక్రవారం ఉదయం తెప్పపై వేటకు వెళ్లగా సముద్రం మధ్యలో నూకరాజు అదుపుతప్పి పడిపోయాడు. ఒడ్డుకు వచ్చిన వారు ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం సమయంలో నూకరాజు మృతదేహం బయటపడింది.