AP: విశాఖ బెల్లం గణపతి ఆలయం సమీపంలోని దుర్గాదేవి మండపం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. మండపం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అన్నం వండుతుండగా ప్రమాదవశాత్తు గిన్నెలు పడిపోయాయి. మరుగుతున్న గంజిపడి 16 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.