KKD: కరప మండలం పెనుగుదురులో పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం రాత్రి దాడి చేసినట్లు కరప ఎస్సై తోట సునీత తెలిపారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి రూ. 2,080 నగదు, 104 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కేసులు పెడతామని ఆమె హెచ్చరించారు.