SRPT: కోదాడ మండలం రెడ్లకుంటలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేష్ (20) గురువారం తెల్లావారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేష్ ఇంటికి వచ్చిన అతని అమ్మమ్మ చూసి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలోనే రాజేష్ మృతి చెందాడు.