కోనసీమ: ఉప్పులగుప్తం మండలం ఎస్.యానాం బీచ్లో మంగళవారం సాయంత్రం గల్లంతైన నేదునూరుకి చెందిన జస్వంత్ మృతదేహం ఇవాళ వాసాల తిప్పతీర ప్రాంతంలో లభ్యమైంది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏసీ మెకానిక్గా పనిచేస్తున్న జస్వంత్ మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.