SRD: హత్నూర మండలం గోవిందరాజు పల్లి శివారులో కుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన స్థానికులు వెంటనే హత్నూర పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వ్యక్తి మృతదేహం ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు. శవం ఒంటిగంట రక్తపు మరకలు గాయాలు ఉన్నాయి. లభ్యమైన మృతదేహన్ని మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.