PDPL: ధర్మారం మండలంలో పెన్షన్ ఇప్పిస్తానంటూ వృద్ధురాలిని మోసం చేసి, 2 తులాల బంగారు గొలుసు దొంగిలించిన అల్లెపు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ జిల్లాల్లో ఇతనిపై 96 కేసులు ఉన్నాయని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. నవీన్ మెడికల్ ఏజెన్సీ వద్ద నిందితుడిని పట్టుకొని, బంగారు గొలుసుతో పాటు రూ.30 వేలు నగదును రికవరీ చేసినట్లు చెప్పారు.