BHPL: మేడిపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం కుళ్లిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం, చిట్యాల (M) ఒడితెల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి (22) తండ్రి అనారోగ్యంతో మరణించాడు. ఆవేదనతో ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమెపై 6న కేసు నమోదైంది. రహదారి పక్కన మృతదేహం ఆధార్ కార్డు ఉండటంతో వాహనదారులు పోలీసులకు సమాచారమిచ్చారు.