కోనసీమ: మద్యం అలవాటు మానుకోమని తల్లిదండ్రులు మందలించడంతో ఉప్పలగుప్తం(M) వాడపర్రుకు చెందిన సురేశ్(25) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 7న యువకుడు విషం తాగగా కుటుంబీకులు అమలాపురంలో కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు.