ATP: బస్సుల్లో ప్రయాణికులను టార్గెట్ చేసుకుని దోపిడీలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్. సుమతి, ఎస్. గీత, ఎస్. రంజిత్, ఎస్. బృంద అనే మహిళలను అరెస్ట్ చేశామని చెప్పారు. వారి నుంచి రూ. 23 లక్షలు విలువైన 242.5 గ్రాముల బంగారు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.