MNCL: మందమర్రి మార్కెట్ ఫ్లై ఓవర్ సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు(65) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు రైల్వే కానిస్టేబుల్ సురేష్ సోమవారం ప్రకటనలో తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో భద్రపరిచామన్నారు. ఎవరైనా గుర్తుపడితే రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.