ఏపీలో తొలిసారి సరోగసీ ద్వారా ఓ దూడ జన్మించింది. తిరుపతి వెటర్నరీ వర్సిటీ ఆధ్వర్యంలో ఐవీఎఫ్ ప్రాసెస్ చేయగా విజయవంతంగా దూడ జన్మించింది. ఈ పద్దతిలో మరో ఐదేళ్లలో 500 దూడలను పుట్టించనున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది.
హైదరాబాద్ లోని ఉప్పల్ లో స్కైవాక్ బ్రిడ్జ్ ప్రారంభం కానుంది. నగరంలో మరికొన్ని స్కైవాక్ బ్రిడ్జ్ లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉప్పల్ స్కైవాక్ బ్రిడ్జ్ ప్రారంభం అవ్వనుంది.
సినీ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా తాను కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ లో పాల్గొంటున్నట్లు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.