• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్లాస్టిక్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత: కమిషనర్

KDP: ప్లాస్టిక్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పులివెందులలోని ఓ ప్రైవేటు పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ సమస్య ప్రధాన సమస్యగా మారిందని ప్రమాదకరంగా మారకముందే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

April 21, 2026 / 09:36 PM IST

తణుకులో మద్యం దుకాణాల్లో తనిఖీలు

W.G: తణుకులోని మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేవీ నాగ ప్రభుకుమార్ ఇవాళ తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఏపీ సురక్ష యాప్ ద్వారా మద్యం నిల్వలను పరిశీలించారు. అనంతరం తణుకు ఎక్సైజ్ స్టేషన్ సందర్శించి స్టేషన్లో కేసుల దర్యాప్తులో పురోగతి, అక్రమ మద్యాన్ని నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

April 21, 2026 / 09:31 PM IST

ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి: సీఐ

ELR: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా భీమడోలు మండలం సూరప్పగూడెం జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కలిగించారు. ఈ సందర్బంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ.. యువత థ్రిల్ కోసం బైక్‌‌లను అతివేగంగా నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ప్రయాణ సమయంలో హెల్మెట్‌ను ధరించాలని సూచించారు.

April 21, 2026 / 09:30 PM IST

సాయి నేత్రాలయం ప్రారంభించిన ఎంపీ లావు

PLD: నరసరావుపేట అరండల్‌పేటలో డా. దండమూడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్మించిన సాయి నేత్రాలయం–లేజర్ & ఫాకో సెంటర్‌ను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ఆసుపత్రులు మరింత అవసరమని పేర్కొన్నారు.

April 21, 2026 / 09:19 PM IST

ఎరువుల దుర్వినియోగం జరగకూడదు: కలెక్టర్

NDL: ఎరువుల దుర్వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో టాస్క్ ఫోర్స్ సమావేశంలో యూరియా పరిశ్రమల వైపు మళ్లకుండా నిఘా పెంచాలని సూచించారు. నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సునీల్ షొరాణ్ హెచ్చరించారు.

April 21, 2026 / 09:04 PM IST

‘స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం’

కోనసీమ: గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలును మరింత పారదర్శకంగా, వేగంగా అందించడానికి స్మార్ట్ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే జోగేశ్వరరావు అన్నారు. మండపేట MPDO కార్యాలయంలో జరిగిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్‌లకు 5జీ స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

April 21, 2026 / 09:00 PM IST

చోలసముద్రంలో పోలీసుల అవగాహన సమావేశం

సత్యసాయి: లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చోలసముద్రం గ్రామంలో సీఐ జనార్ధన్ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి చోరీల నివారణ, రోడ్డు భద్రత, మహిళలపై నేరాలు, శారీరక దాడులు, భూ వివాదాలపై సూచనలు ఇచ్చారు. సమస్యలు ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

April 21, 2026 / 09:00 PM IST

‘ఎస్సీ కాలనీలో అమ్మవారి ఘటాలు తిరగాలి’

పార్వతీపురం పట్టణం కొత్తవలసలో కొత్త పోలమ్మ పండుగ వివాదం రేపుతోంది. ఈనెల 27 నుంచి 29 వరకు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా, అమ్మవారిని తమ వీధిలోకి తీసుకురావాలని ఎస్సీ కాలనీ వాసులు కోరుతున్నారు. అయితే, అగ్రవర్ణాలకు చెందిన కమిటీ పెద్దలు ఇందుకు నిరాకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాలనీ ప్రజలు నిరసన చేపట్టారు.

April 21, 2026 / 08:48 PM IST

‘అధిక దిగుబడులు కోసం శిక్షణ అందించాలి’

ASR: వ్యవసాయ ఆధారిత జిల్లాను మరింత బలోపేతం చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, సుగంధ ద్రవ్యాల శాఖల సమన్వయంతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే పంటలను పండించేలా చూడాలన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. దిగుబడులు పెంచేందుకు రైతులకు శిక్షణలను అందించాలన్నారు.

April 21, 2026 / 08:47 PM IST

‘మహిళా సంఘాల పురోగతికి వీవోఏలే వెన్నెముక’

SKLM: మహిళా సంఘాల ఆర్థిక పురోగతికి వీవోఏలు వెన్నెముక వంటి వారని ఎమ్మెల్యే శిరీష అన్నారు. ఈ మేరకు మంగళవారం పలాస టీడీపీ కార్యాలయంలో 142 వీవోఏలకు ఉచితంగా మొబైల్ ఫోన్లను ఎపంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పొదుపు సంఘాల లావాదేవీలు, రికార్డుల నిర్వహణను ఆన్‌లైన్ ద్వారా వేగవంతం చేసేందుకు ఈ స్మార్ట్‌ ఫోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు

April 21, 2026 / 08:36 PM IST

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు: కమిషనర్

కాకినాడ నగరంలో దోమల సమస్యను అరికట్టేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ NVV సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సాయంత్రం కొండయ్యపాలెం ప్రాంతంలో నిర్వహించిన ఫాగింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… నగర వ్యాప్తంగా దోమల నిర్మూలనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

April 21, 2026 / 08:34 PM IST

మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం

కడప జిల్లాలో మహిళా భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రాజంపేట CI నాగార్జున ఆధ్వర్యంలో గాలివారిపల్లిలో మహిళలకు ‘శక్తి’ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో SMS ద్వారా 112కు సమాచారం ఇస్తే 10 నిమిషాల్లో పోలీసులు స్పందిస్తారని తెలిపారు.

April 21, 2026 / 08:34 PM IST

‘ఏఐవైఎఫ్ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి’

PLD: కోటప్పకొండలో జూన్ 1 నుంచి 5 వరకు ఏఐవైఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన కరపత్రాలను నేతలు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగ సమస్యలపై యువత పోరాడాలని రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. యువత హక్కులు, సామాజిక అంశాలపై ఈ శిబిరంలో మేధావులతో లోతైన చర్చలు ఉంటాయన్నారు. యువకులు భారీగా తరలిరావాలని కోరారు.

April 21, 2026 / 08:31 PM IST

లేపాక్షి, ఆప్కో షోరూంలను తనిఖీ చేసిన మంత్రి

ATP: అనంతపురం నగరంలోని లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్, ఆప్కో మెగా షోరూంలను మంత్రి సవిత, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హస్తకళలను, చేనేత వస్త్రాలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. విక్రయాలు పెంచేలా షోరూంలను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకే లభిస్తున్నాయని మంత్రి తెలిపారు.

April 21, 2026 / 08:30 PM IST

స్మార్ట్ ఫోన్లతో సేవలు మరింత సమర్ధవంతం: MLA

KRNL: ఓర్వకల్లు మండల కేంద్రంలోని పొదుపు ఐక్య సంఘం భవనంలో మంగళవారం SERP ఆధ్వర్యంలో VOAలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి వీఓఏలకు 5జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. వీటితో గ్రామీణ స్థాయిలో సేవలు మరింత సమర్థంగా అందించాలన్నారు.

April 21, 2026 / 08:30 PM IST