VZM: మాజీ సీఎం జగన్పై గతంలో బొత్స, ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలను గుర్తు చేస్తూ ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు చేస్తున్న ఊసరవెల్లి ఆరోపణలను ప్రజలు నమ్మరని, అందుకే ప్రజలకు మరోసారి గుర్తు చేస్తిన్నామన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం జరజాం పంచాయతీలో టీడీపీ కార్యకర్త జరుగుల్ల లక్ష్మణరావు భార్య అన్నపూర్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆమెకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.1,28,000 చెక్కును ఆదివారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
BPT: రేపల్లెలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో 33 మందికి CMRF మంజూరైంది. మంజూరైన మొత్తం రూ.32,82,393 చెక్కులను స్థానిక టీడీపీ నేతలు లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఆపత్కాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి, మంత్రికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
SS: జిల్లా వైసీపీ అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్ సోమవారం గోరంట్ల మండలంలోని మల్లాపల్లి పంచాయతీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటనను జయప్రదం చేయాలని మండల కన్వీనర్ పగడాల వెంకటేష్, టౌన్ కన్వీనర్ మేదర శంకర పిలుపునిచ్చారు.
SKLM: పోలాకి మండలం కోరాడ లచ్చయ్య పేట గ్రామం శ్రీ శ్రీ శ్రీ గ్రామదేవత అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఆదివారం గ్రామస్థుల ఆహ్వానంతో ఎమ్మెల్యే రమణమూర్తి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు ఉన్నారు.
VZM: ఎస్.కోట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్డవరంలో గంజాయి కట్టడిపై సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఆదివారం అవగాహన కల్పించారు. గ్రామాల్లో అక్రమంగా గంజాయి రవాణా చేసినా, విక్రయించిన, సేవించిన చట్టరీత్య నేరం అని తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ELR: ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో ఆదివారం రూ. 4.02 కోట్లతో 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి గృహనిర్మాణ మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు.
KRNL: ఆదోనిలో డెంటల్ ఆసుపత్రిని ఇవాళ ఎమ్మెల్యే పార్థసారథి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో దంత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు మెరుగైన వైద్య సేవలలో కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం ‘PGRS’ నిర్వహించనున్నట్లు పీడీ శివరాం ప్రసాద్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. రాలేని వారు ఆన్లైన్లో విన్నవించుకోవచ్చన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కృష్ణా: జిల్లాలో ఆధునిక టోల్ విధానం అమల్లోకి వచ్చింది. వెదురుపావులూరు సమీపంలోని NHపై ఉన్న టోల్ ప్లాజాను పూర్తిగా క్యాష్లెస్, బూత్లెస్ విధానంగా మార్చారు. ఏప్రిల్ 10 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇకపై వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు చేయాలి. బ్యాలెన్స్ లేకుంటే టోల్ వద్దే డిజిటల్ చెల్లింపు చేసి, అదనంగా 25 శాతం రుసుము చెల్లించాలి.
BPT: ఈ నెల 19న బాపట్లలో ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం తొలి ఆవిర్భావ వార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ.. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజుకు సంఘ నేతలు ఆహ్వాన పత్రికను అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు ఆదివారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
కోనసీమ: మీ భూమి మీకే సొంతం, ఆ భూమిపై మరెవ్వరికీ హక్కు లేదు అని చాటడానికి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో ఆదివారం జరిగిన పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు.
E.G: రాజమండ్రి త్యాగరాజు సేవా సమితి మలబార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన సీఎస్ఆర్ స్కాలర్షిప్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆదివారం ప్రభుత్వ కళాశాలలకు చెందిన 286 మంది మెరిట్ విద్యార్థులకు రూ. 22.56 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్కరణలకు తోడుగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం గర్వకారణమన్నారు.
KDP: తొండూరు మండలంలోని ఇనగలూరులో ఇరువురు వ్యక్తుల మధ్య ఘర్షణ జరగడంతో కారు ధ్వంసమైంది. ఎస్సై ఘన మద్దిలేటి కథనం మేరకు.. ఇనగలూరు గ్రామానికి చెందిన గణేశ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డిలు అమ్మాయి విషయమై కక్ష పెంచుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగి కారు ధ్వంసమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
ATP: ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న నిర్వహించనున్న ‘రాయలసీమ చిత్రకళ ఉత్సవం’ 10వ వార్షిక ఆర్ట్ గ్యాలరీ ఆహ్వానం అందడం సంతోషంగా ఉందని మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. ఆదర్శ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరగనుంది. కళాకారుల ప్రతిభను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.