GNTR: జన గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ‘సెన్సస్ 5K రన్’ నిర్వహించాలని కలెక్టర్ CM.సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఇంటింటి ప్రచారం చేపట్టాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
PPM: మహిళా సంఘాల అభివృద్ధికి VAOలు కీలక పాత్ర పోషించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచించారు.ఈ మేరకు ఆమె సోమవారం సాలూరులో సాలూరు, మక్కువ, పాచిపెంట VAOలకు సెల్ ఫోన్లు అందజేసారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి మహిళ వ్యాపారవేత్తగా ఎదగాలని వారి ఉన్నతికి స్త్రీ నిధి రుణాలను అందజేసినట్లు తెలిపారు.
ATP: పెద్దపప్పూరు మండలంలోని దర్మాపురం, అమ్మలదిన్నె, ముచ్చుకోట గ్రామాల్లో సోమవారం దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్, ఈఓ సుబ్రమణ్యం కౌలు భూముల వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఆలయానికి సంబంధించిన భూములకు వేలంపాట నిర్వహించగా రూ.7,37,500 ఆలయానికి ఆదాయం వచ్చిందన్నారు.
నెల్లూరు: బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఈనెల 26న నెల్లూరు వస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకట జ్యోతి తెలిపారు. నెల్లూరులో మాట్లాడుతూ.. యాదవ భవన్లో ఈనెల 26న బీసీ సంక్షేమ సంఘం విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.
సత్యసాయి: ధర్మవరం YCP సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జిల్లా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ముదిగుబ్బ మండలంలో ఉపాధి హామీ పథకం, హార్టికల్చర్ పనులలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని కలెక్టరుకు వివరించారు. క్షేత్రస్థాయిలో పనులు జరగకపోయినా జరిగినట్లు చూపిస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తూ.గో: సీతానగరం మండలం రఘుదేవపురంలో ఈ నెల 13న భార్య సుబ్బలక్ష్మిని హత్య చేసి, తాను కూడా చనిపోవడానికి యత్నించిన కోట నూకరాజును సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కుమారుడు చనిపోయాక కోడలు, మనవళ్లను పోషించలేననే మనస్తాపంతో నూకరాజు ఈ దారుణానికి ఒడిగట్టాడని వారు తెలిపారు. ఆసుపత్రిలో కోలుకున్న నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు కోరుకొండ CI మూర్తి తెలిపారు.
ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణతో కలిసి నారాయణపురం – నాగిరెడ్డిపల్లి వంతెనను ప్రారంభించారు. సుమారు రూ. 4.79 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జి వల్ల 15 గ్రామాల ప్రజల 40 ఏళ్ల నాటి సమస్య పరిష్కారమైంది. గతంలో వంతెన లేక ప్రజలు పది కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేదని ఎమ్మెల్యే తెలిపారు.
కోనసీమ: అయినవిల్లి మండలం క్రాపలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోటిపల్లి రాజారావు (47) బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు దిగుడుబావిలో పడి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మృతునికి భార్య మాణిక్యం, కుమార్తె ఉన్నారు. అయినవిల్లి ఎస్సై కే జ్యోతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
NDL: ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సోమవారం గోస్పాడులోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో గోశాలను ప్రారంభించారు. విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ పీ.దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చాగంటి దంపతులు శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో పాఠశాలను ఏర్పాటు చేయడం అద్భుతమని ఆయన కొనియాడారు.
ATP: ఆయా శాఖల పరిధిలో కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై అధికారులు దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి హౌసింగ్, ఉపాధి హామీ, జలధార, జనగణన తదితర అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎంఏవై అర్బన్ కింద 17,239 ఇళ్లను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు.
CTR: వేదురుకుప్పం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పురుషోత్తం, తహసీల్దార్ బాబు ఆధ్వర్యంలో 2027 జనాభా లెక్కల రెండో బ్యాచ్ ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ప్రారంభమైంది. అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
TPT: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.వో నరసింహులు సంబంధిత అధికారులతో కలిసి మలేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బ్యానర్ను ఆవిష్కరించారు. మలేరియా నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు.
కృష్ణా: చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన కానిస్టేబుళ్లు సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. మంగళగిరి NRI ఆసుపత్రిలో వారికి చికిత్స అందగా, జిల్లా SP వి. విద్యాసాగర్ నాయుడు వెళ్లి పరామర్శించారు. వైద్యుల కృషి, సిబ్బంది ధైర్యం, కుటుంబాల మద్దతుతో కోలుకున్నారని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి పామూరు, నెల్లూరు మీదుగా తిరుపతికి ప్రతిరోజు సాయంత్రం 06.00 గంటలకు ఎక్స్ప్రెస్ సర్వీసును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ షయానా బేగం తెలిపారు. ఈ బస్సు సాయంత్రం 6 కనిగిరిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 1 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి తిరుపతిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు కనిగిరికి చేరుకుంటుందన్నారు.
BPT: సంతమాగులూరులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కొప్పరం జడ్పీ పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తారు. అనంతరం 10:30 గంటలకు కొమ్మాలపాడులో నూతనంగా నిర్మించిన కాపు కమ్యూనిటీ హాల్ను ప్రారంభిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయం తెలిపింది.