• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పోలేరమ్మను ప్రార్థించిన మంత్రి దుర్గేష్

E.G: నిడదవోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా అభివృద్ధి చేయాలని తల్లి పోలేరమ్మను ప్రార్థించినట్లు మంత్రి కందుల దుర్గేష్ శనివారం తెలిపారు. పెరవలి మండలం ముక్కామల గ్రామంలో జరిగిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం కోసం ఆకాంక్షించారు.

April 12, 2026 / 09:35 AM IST

కొండవాగుల నీటితో గిరిజనుల వేసవి వరి సాగు

PPM: గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు తమ సంప్రదాయ పద్ధతుల్లో వేసవి వరి పంటను పండిస్తూ ఆకట్టుకుంటున్నారు. కొండవాగుల నుంచి వచ్చే సహజ జలాలను వినియోగిస్తూ నీటి కొరత మధ్య కూడా పంటలను సాగు చేస్తున్నారు. కష్టపడే తత్వం, ప్రకృతితో అనుసంధానం గల జీవన విధానం గిరిజనుల ప్రత్యేకతగా నిలుస్తోంది. వారి కృషితో పచ్చని పంట పొలాలు కళకళలాడుతున్నాయి.

April 12, 2026 / 09:33 AM IST

నేడు కుడమలూరులో అంకాలమ్మ తిరునాలు

KDP: ఒంటిమిట్ట మండలంలోని కుడమలూరులో ఇవాళ అంకాలమ్మ తిరునాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్తు దీప కాంతులతో అలంకరించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిటీ వివరించింది. గ్రామానికి బంధువులు, మిత్రులు తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది.

April 12, 2026 / 09:30 AM IST

రూ. 20 లక్షల మోసం.. కేసు నమోదు

AKP: రాజకోడూరుకు చెందిన వ్యక్తి వద్ద రూ.20 లక్షలు మోసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశ్‌నగర్‌కు చెందిన కర్రి వెంకటరమణ వద్ద బైలపూడి సన్యాసిరావు, వెంకటరమణ, గణేష్ డబ్బు తీసుకుని వడ్డీతో చెల్లిస్తామని చెప్పి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

April 12, 2026 / 09:28 AM IST

బొబ్బిలి డీఎస్పీగా గోవిందరావు

VZM: రాష్ట్రంలో 29 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. అందులో భాగంగా విజయనగరం టౌన్ ఇంచార్జ్ డీఎస్పీ, దిశా డీఎస్పీగా పనిచేస్తున్న ఆర్.గోవిందరావును బొబ్బిలి డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఇప్పటివరకు అదే స్థానంలో విధులు నిర్వహించిన భవ్యారెడ్డి డీజీపీ కార్యాలయానికి బదిలీ కావడంతో చీపురుపల్లి డీఎస్పీగా పనిచేస్తున్న రాఘవులును బొబ్బిలి ఇంచార్జ్ డీఎస్పీగా వ్యవహరించారు.

April 12, 2026 / 09:26 AM IST

రేపు జాల్లాలో PGRS: కలెక్టర్

KRNL: జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించబడతాయని కలెక్టర్ డా. ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా, ఆన్‌లైన్‌లో meekosam.ap.gov.in ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు.

April 12, 2026 / 09:23 AM IST

కనక మహాలక్ష్మి అమ్మవారికి తులసి దళార్చన

విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తులసి దళార్చన సేవ అత్యంత వైభవంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముగ్గురు ఉభయ దాతలు పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​పూజ అనంతరం ఆలయ అర్చకులు దాతలకు తీర్థప్రసాదాలను అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.

April 12, 2026 / 09:17 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: కృత్తివెన్ను మండల టీడీపీ కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు వైద్య చికిత్సల నిమిత్తం మంజూరైన రూ.34 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నిన్న అందజేశాను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో అవసరమైన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

April 12, 2026 / 09:12 AM IST

మాంసం ప్రియులకు ఊరట.. తగ్గిన ధరలు

SKLM: జిల్లాలో మాంసం ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించింది. చికెన్ ధరలు గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం స్కిన్‌‌తో కూడిన చికెన్ కేజీ రూ.213, స్కిన్‌ లెస్ చికెన్ రూ.243గా ఉంది. నాటుకోడి రూ.700, పొట్టేలు మాంసం రూ.1000కి విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం ఉండవచ్చని వ్యాపారులు తెలిపారు. 

April 12, 2026 / 09:11 AM IST

ఆవు కడుపులో 100 కేజీల ప్లాస్టిక్

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో పుల్లయ్యకు చెందిన ఆవు అస్వస్థతకు గురైంది. కడుపు ఉబ్బి మూర్ఛపోవడంతో పశుసంవర్ధక శాఖ ఏడీ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్‌లో ఆవు కడుపు నుంచి సుమారు 100 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించినట్లు వైద్యులు తెలిపారు. సమయానికి చికిత్సతో ఆవు ప్రాణాలు కాపాడడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.

April 12, 2026 / 09:11 AM IST

సింగరాయకొండలో చోరీ.. బంగారం, నగదు చోరీ

ప్రకాశం: సింగరాయకొండలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. లలితమ్మకు చెందిన ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువా పగలగొట్టి నగదు, బంగారాన్ని దోచుకు వెళ్లారు. వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతానికి వెళ్లిన బాధితురాలు ఆదివారం ఉదయం ఇంటికి వచ్చింది. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.

April 12, 2026 / 09:10 AM IST

జిల్లా రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

ఎన్టీఆర్: విశాఖపట్నం-లోకమాన్య(నం.18519/20) తిలక్ టెర్మినస్ (LTT) ఎక్స్‌ప్రెస్ రైళ్లను నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 1 నుంచి 4 వరకు ఈ రైళ్లు విజయవాడ-గుంటూరు-పగిడిపల్లి మార్గంలో ప్రయాణిస్తాయి. ఈ సమయంలో ఖాజీపేట జంక్షన్‌లో స్టాప్‌ను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

April 12, 2026 / 09:07 AM IST

నేడు బద్వేలులో కంటి వైద్య శిబిరం

KDP: బద్వేలు పురపాలికలోని నెల్లూరు రోడ్డులో రాచ పూడి నాగభూషణం డిగ్రీ కళాశాలలో ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వ హిస్తున్నట్లు కళాశాల ఏవో సాయికృష్ణ తెలిపారు. శిబిరంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య శస్త్ర చికిత్సలు నిర్వహణ, మందులు, అద్దాల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 12, 2026 / 09:06 AM IST

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

TPT: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు అలిపిరి సీఐ రామకిశోర్ తెలిపారు. జీవకోన ప్రాంతంలోని రాఘవేంద్ర నగర్ కూడలి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ చిన్నంగారి షణ్ముగం(49)ను అరెస్టు చేసి అతని బ్యాగ్‌లో ఉన్న నాలుగు కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు.

April 12, 2026 / 09:04 AM IST

మామిడి రైతులకు గమనిక

CTR: తవణంపల్లి మండలంలో టోకెన్లు పొందిన మామిడి రైతులకు ఇవాళ, రేపు ఉదయం 10 గంటలకు దిగువమాఘం సొసైటీ భవనం వద్ద కవర్లు పంపిణీ చేయనున్నారు. రైతులు తమకు కేటాయించిన తేదీల్లోనే రావాలని అధికారులు కోరారు. కవర్లు లూజ్‌గా ఉండే అవకాశం ఉన్నందున సంచులు తీసుకు రావాలని హార్టికల్చర్ అధికారిణి సాగరిక సూచించారు.

April 12, 2026 / 09:04 AM IST