• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

21న గుంటూరు నగరంలో 2K వాక్

గుంటూరు: మత్తుపదార్థాల రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ఈ నెల 21న గుంటూరు నగరంలో 2K వాక్ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేయస్ లక్ష్మణరావు వెల్లడించారు. యాంటీ డ్రగ్స్ ఫోరమ్ శుక్రవారం బ్రాడీపేటలో 2K వాక్ పోస్టర్లను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా లక్ష్మణరావు మాట్లాడారు. ఉదయం 8 గంటలకు శంకర్ విలాస్ సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.

April 17, 2026 / 12:11 PM IST

ప్రత్యేక అలంకరణలో స్వయంభూ జంబుకేశ్వరుడు

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభూ జంబుకేశ్వరుడు శుక్రవారం అమావాస్య రోజు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చాడు. పురోహితులు రామకృష్ణ ఉదయాన్నే స్వామి మూల విరాట్‌కి ప్రత్యేక అభిషేకాలు చేపట్టి, పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగలనైవేద్యాలు అందించారు. భక్తులు పెద్దఎత్తున ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

April 17, 2026 / 12:11 PM IST

అమలాపురంలో ఏడుగురిపై కేసు నమోదు

కోనసీమ: అమలాపురం మున్సిపల్ కాలనీలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వీరబాబు తెలిపారు. పరస్పర ఫిర్యాదుల మేరకు మీసాల కృష్ణకుమారి వర్గంపై ముగ్గురు, గాడ విజయ్ పిర్యాదుతో మరో నలుగురిపై శుక్రవారం కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

April 17, 2026 / 12:10 PM IST

మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన MLA

PPM: మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీడీవో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల, ప్రయాణికుల, పాదచారుల, వాహనదారుల యొక్క దాహార్తిని తీర్చేందుకు ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటుచేసాము అన్నారు.

April 17, 2026 / 12:10 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలి’

VZM: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కార్యకర్తలు వారధిలా పనిచేయాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్.కోట మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆమె కేడర్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

April 17, 2026 / 12:10 PM IST

32 మంది వీఓఏలకు రాష్ట్ర ప్రభుత్వ ఉచిత సెల్ ఫోన్లు

కృష్ణా: స్వయం సహాయక సంఘాల బలోపేతానికి వీఓఏల పాత్ర కీలకమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మోపిదేవి మండలానికి చెందిన 32మంది వీఓఏలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సమకూర్చిన నూతన మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే చేతులమీదుగా అందచేశారు. వెలుగు ఏపీఎం డీ.శ్రీను పాల్గొన్నారు.

April 17, 2026 / 12:07 PM IST

‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి’

SKLM: ఆమదాలవలస కృష్ణాపురం మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాల పరిధిలో కాంపెయినింగ్ నిర్వహించినట్లు హెచ్ ఎం ఎస్ ధనుంజయరావు శుక్రవారం తెలిపారు. విద్యార్థులకు ఒత్తిడి లేని బోధనతోపాటు ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు, బ్యాగు, యూనిఫాం, మిడ్ డే మీల్స్ వంటి సదుపాయాలు కల్పిస్తుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.

April 17, 2026 / 11:46 AM IST

బియ్యం గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేసిన DRDO

VZM: జిల్లా రెవెన్యూ డివిజనల్ అదికారి ( DRDO) ఎం.సుధారాణి శుక్రవారం రేగిడి ఆముదాలవలస మండలంలోని MLS రైస్‌ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాంలోని స్టాక్‌ నిల్వల పరిస్థితి, నిల్వ విధానాలు, రికార్డుల నిర్వహణ, పంపిణీ ప్రక్రియ, స్టాక్‌ రిజిస్టర్లు పరిశీలించారు. తూనికలు, కొలతల పరికరాలను తనిఖీ చేసి వాటి కచ్చితత్వాన్ని నిర్ధారించారు.

April 17, 2026 / 11:41 AM IST

29 నుంచి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

NDL: అవుకులోని పురాతన లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈనెల 29 నుంచి మే 7 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్ననట్లు శుక్రవారం ఆలయ నిర్వాహకులు తెలిపారు. 29న అంకురార్పణ, 30న స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. మే 1 నుంచి 5 వరకు వివిధ వాహన సేవలు, 6న రథోత్సవం, 7న వసంతోత్సవంతో వేడుకలు ముగుస్తాయని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

April 17, 2026 / 11:41 AM IST

అదనపు బస్సు లేక గ్రామస్థుల ఇబ్బందులు

KDP: లింగాల నుంచి ఉదయాన్నే వెళ్లే మొదటి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం గ్రామస్థులు, విద్యార్థులు, కూలీలు, ఉద్యోగస్థులు ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో ఆ బస్సులో అడుగు తీసి అడుగు పెట్టాలంటే కష్టంగా మారిందన్నారు. RTC DM స్పందించి ప్రయాణికుల అవస్థలను గమనించి అదనపు బస్సును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

April 17, 2026 / 11:41 AM IST

అమరావతి నిర్మాణానికి రూ.1,5,200 విరాళం

కృష్ణా: గుడివాడకు చెందిన అట్లూరి లక్ష్మీ కుమారి, కాట్రగడ్డ నిర్మల, నందమూరి పద్మజ, త్రిపురనేని సుజాత, పొట్లూరి శేషుబాబు, మేక ప్రమీలారాణి సీఎం చంద్రబాబును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.1,5,200 చెక్కును సీఎం చంద్రబాబుకు వారు అందజేశారు. వారిని సీఎం చంద్రబాబు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

April 17, 2026 / 11:41 AM IST

భర్తపై భార్య కేసు.. మనస్తాపంతో ఆత్మహత్య..!

KKD: తాళ్లరేవు మండలం సీతారామపురంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో వివాదాల కారణంగా కేసు నమోదు కాగా, మనస్తాపంతో సెల్ఫీ వీడియో, లేఖ రాసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. తన 14 ఏళ్ల కుమారుడిని తల్లి వద్దే ఉంచాలని వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

April 17, 2026 / 11:40 AM IST

ప్రజల ఇబ్బందుల పట్ల నిర్లక్ష్యం వద్దు: ఎమ్మెల్యే జేసీ

ATP: తాడిపత్రిలోని 32వ వార్డు బిందెల కాలనీలో ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అక్కడికక్కడే మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజల ఇబ్బందుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.

April 17, 2026 / 11:40 AM IST

మార్కాపురం కోర్టుకు లాయర్లు విధుల బహిష్కరణ

ప్రకాశం: నేడు మార్కాపురం కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలీ జహీర్ ఆధ్వర్యంలో లాయర్లు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.. అనంతపురం బార్ అసోసియేషన్ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా బహిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురంలో 116 మంది లాయర్లు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

April 17, 2026 / 11:37 AM IST

సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీవో

అన్నమయ్య: పీలేరు(M) ముడుపుల వేముల గ్రామ సచివాలయాన్ని RDO శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.రికార్డులను పరిశీలించి, హాజరు వివరాలు తెలుసుకున్నారు. గైర్హాజరైన సిబ్బందిపై విచారణ చేపట్టారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో గ్రామ రెవెన్యూ అధికారి వెంకటేష్ పాల్గొన్నారు.

April 17, 2026 / 11:35 AM IST